News December 18, 2024
IND vs AUS మ్యాచ్ డ్రా

బ్రిస్బేన్లో జరుగుతున్న IND vs AUS 3వ టెస్ట్ డ్రా అయింది. 5వ రోజు 2వ ఇన్నింగ్స్లో AUS 89-7 వద్ద డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లీడ్తో కలిపి భారత్ ముందు 275పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. IND బ్యాటింగ్ ప్రారంభమైన కాసేపటికి 8/0 వర్షం ప్రారంభమైంది. వర్షం తీవ్రత పెరగడం, బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. BGT 5టెస్టుల సిరీస్లో 1-1తో ఇరు జట్లు సమానంగా నిలిచాయి.
Similar News
News November 7, 2025
సచివాలయాల పేరును మార్చలేదు: CMO

AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’గా మార్చారని వస్తున్న వార్తలు అవాస్తవమని సీఎంవో వివరణ ఇచ్చింది. 2047 స్వర్ణాంధ్ర విజన్ సాధన కోసం విజన్ యూనిట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు పని చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని పేర్కొంది. అంతే తప్ప వాటి పేరును విజన్ యూనిట్లుగా మార్చలేదని తెలిపింది.
News November 7, 2025
ఐఐటీ బాంబేలో 53 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఐఐటీ బాంబేలో 53 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంటర్, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, సీటెట్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. వెబ్సైట్: https://www.iitb.ac.in/
News November 7, 2025
శ్రీరాముడి విజయం వెనుక సరస్వతీ దేవి

రావణుడితో యుద్ధంలో శ్రీరాముడి విజయానికి సరస్వతీ దేవి పరోక్షంగా కారణమయ్యింది. రావణుడితో పాటు బ్రహ్మ దేవుడు కుంభకర్ణుడికి కూడా వరం ఇచ్చాడు. అయితే ఆ సమయంలో సరస్వతీ దేవి లోక కళ్యాణానికై అతని నాలుకపై చేరి ‘నిద్ర వరం’ అడిగేలా చేసింది. ఈ అతి నిద్ర కారణంగా కుంభకర్ణుడు ఆలస్యంగా రావడంతో రావణ సైన్యం యుద్ధంలో ఓడిపోయింది. ధర్మసంస్థాపన జరిగింది.
☞ ఇలాంటి మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


