News December 18, 2024

1000 కొత్త బస్సులు కొంటాం: పొన్నం

image

TG: మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగిందని, దీనికి అనుగుణంగా 1000 కొత్త బస్సులు కొంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 40 నుంచి 100శాతానికి పెరిగిందన్నారు. కొత్త బస్సులను డ్వాక్రా సంఘాల ద్వారా కొంటామన్నారు. అవసరమైన చోట కొత్త డిపోలు నిర్మిస్తామన్నారు. కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్లకు బస్సులను పెంచుతామని MLAల ప్రశ్నలకు అసెంబ్లీలో బదులిచ్చారు.

Similar News

News January 5, 2026

తెలుగు హీరోలను తాకిన బికినీ ట్రెండ్

image

SMలో గ్రోక్ AIతో మొదలైన <<18744158>>బికినీ ట్రెండ్<<>> భారతీయులను కంగారు పెట్టిన విషయం తెలిసిందే. నిండుగా దుస్తులున్న ఫొటోలనూ ఒక కమాండ్‌తో బికినీలోకి మార్చేస్తోంది. హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలు ఈ ట్రెండ్‌కు బాధితులయ్యారు. కేంద్రం సీరియస్ అయ్యి ఆ కంటెంట్ తొలగించాలని ఆదేశించినా ఫలితంలేకుండా పోయింది. ఇప్పుడు దీని ఎఫెక్ట్ తెలుగు స్టార్ హీరోలను తాకింది. ట్విటర్‌లో వారి ఫొటోలను కూడా కొందరు బికినీల్లోకి మారుస్తున్నారు.

News January 5, 2026

పిల్లలకు ఈ పోషకాలు అత్యవసరం

image

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విటమిన్లు, మినరల్స్ అన్నీ తగినంత అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా విటమిన్లు A, B, C, D, E, అండ్ K వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు పిల్లలకు చాలా అవసరం. ఆరోగ్యకరమైన అభివృద్ధికి వారికి ఫోలేట్, కాల్షియం, అయోడిన్, ఇనుము, జింక్ కూడా కావాలి. ఈ పోషకాలు పిల్లల మెదడు, నరాల అభివృద్ధి, కంటి చూపు, ఎముకల బలం, రోగనిరోధక శక్తి, జీవక్రియకు సహకరిస్తాయి.

News January 5, 2026

బెయిలా? జైలా? ఉమర్ ఖలీద్‌పై నేడే సుప్రీం తీర్పు

image

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఐదేళ్లుగా జైలులో ఉన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. డిసెంబర్‌లో సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. నిందితులు ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర పన్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తుండగా.. ఎటువంటి ఆధారాలు లేకుండా ఏళ్ల తరబడి జైల్లో ఉంచడం అన్యాయమని నిందితుల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు.