News December 18, 2024
కోహ్లీ ఒక్కడే మిగిలాడు!

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులో ఒక్కరు మినహా మిగిలిన ప్లేయర్లంతా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. నిన్నటి వరకు ఆల్రౌండర్ అశ్విన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మాత్రమే యాక్టివ్ ప్లేయర్ల జాబితాలో ఉండేవారు. అయితే, ఇవాళ అశ్విన్ వీడ్కోలు పలకడంతో కేవలం కోహ్లీ ఒక్కడే మిగిలారు. ఈక్రమంలో అప్పటి WC ఫొటోలో కోహ్లీని హైలైట్ చేసిన ఫొటో వైరలవుతోంది.
Similar News
News January 15, 2026
ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు

గతేడాది JUNEలో జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదంలో ఆ విమాన పైలట్ సుమిత్ సభర్వాల్ కూడా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సుమిత్ మేనల్లుడు, కెప్టెన్ వరుణ్కు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) నోటీసులిచ్చింది. దీనిని పైలట్స్ ఫెడరేషన్(FIP) తప్పుపట్టింది. కేసుతో సంబంధం లేని వ్యక్తిని విచారణకు పిలిచారని, ఇది వేధింపులతో సమానం అంటూ AAIBకి లీగల్ నోటీసులు పంపింది.
News January 15, 2026
BMCలో బీజేపీదే హవా.. ఎగ్జిట్ పోల్స్ అంచనా

ముంబై మున్సిపల్ (BMC) ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ, ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేనకు 131-151 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల కూటమి 58-68, కాంగ్రెస్ 12-16 వార్డులు గెలుచుకుంటాయని పేర్కొంది. కాగా BMCలో మొత్తం 227 వార్డులకు ఇవాళ ఎన్నికలు జరగ్గా, రేపు ఫలితాలు రానున్నాయి.
News January 15, 2026
షుగర్ తగ్గాలా? తిన్న తర్వాత 10 నిమిషాలు ఇలా చేయండి!

బ్లడ్ షుగర్ లెవల్స్ను తగ్గించుకోవడానికి కఠినమైన డైట్లు, భారీ వ్యాయామాలు అవసరం లేదని AIIMSలో శిక్షణ పొందిన డాక్టర్ సౌరభ్ సేథి చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కేవలం 10 ని.ల నడక మందులకన్నా బాగా పనిచేస్తుందని తెలిపారు. నడిచినప్పుడు రక్తంలోని గ్లూకోజ్ను కండరాలు ఇంధనంగా వాడుకుంటాయి. దీంతో తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ సడన్గా పెరగవు. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి కాలేయంలో కొవ్వు చేరకుండా ఉంటుంది.


