News December 18, 2024
కోహ్లీ ఒక్కడే మిగిలాడు!

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులో ఒక్కరు మినహా మిగిలిన ప్లేయర్లంతా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. నిన్నటి వరకు ఆల్రౌండర్ అశ్విన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మాత్రమే యాక్టివ్ ప్లేయర్ల జాబితాలో ఉండేవారు. అయితే, ఇవాళ అశ్విన్ వీడ్కోలు పలకడంతో కేవలం కోహ్లీ ఒక్కడే మిగిలారు. ఈక్రమంలో అప్పటి WC ఫొటోలో కోహ్లీని హైలైట్ చేసిన ఫొటో వైరలవుతోంది.
Similar News
News January 11, 2026
నేషనల్ అథారిటీ కాంపాలో ఉద్యోగాలు

నేషనల్ కాంపెన్సేటరీ అపారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ(నేషనల్ అథారిటీ <
News January 11, 2026
పసుపు పాలిషింగ్ – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పసుపును పాలిషింగ్ చేయడం వల్ల దుంపలు, కొమ్ములపై ఉండే దుమ్ము, ధూళితో పాటు వేర్లు, పొలుసులు తొలగి దుంపలు చూడటానికి ఆకర్షణీయంగా కనబడతాయి. పాలిషింగ్ కోసం చేతితో తిప్పే లేదా విద్యుత్తో నడిచే పాలిషింగ్ డ్రమ్ములు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పాలిష్ చేసేటప్పుడు రంగు కోసం పసుపు పొడిని మాత్రమే వాడాలి. ఇతర కృత్రిమ రంగులు/రసాయనాలు కలపకూడదు. కొమ్ములను, దుంపలను సైజును బట్టి గ్రేడింగ్ చేసి మార్కెట్కు పంపాలి.
News January 11, 2026
అయ్యప్ప మాల ఎక్కడ వేసుకున్నామో అక్కడే తీయాలా?

ఇలాంటి నియమం లేదు. యాత్ర ముగిశాక ఇంటికొచ్చి గురుస్వామి సమక్షంలో దీక్షా విరమణ చేయవచ్చు. శబరిమలలో మాల తీయకూడదంటారు. మాల ధరించి ఉండటమే స్వామి దర్శనానికి ప్రధాన అర్హత. ఇంటికి చేరాక ద్వారం వద్ద కొబ్బరికాయ కొట్టి, పూజ చేసి, మంత్రపూర్వకంగా మాల విరమణ చేయాలి. మాలను పాలలో శుద్ధి చేసి భద్రపరచాలి. స్థలం కంటే భక్తి, క్రమశిక్షణగా ఉండే వ్రత పాలనే ముఖ్యం. పద్ధతిగా దీక్ష ముగిస్తే వ్రత ఫలం పూర్తిగా లభిస్తుంది.


