News December 19, 2024
కృష్ణా: డిప్లొమా విద్యార్థులకు ముఖ్య గమనిక

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో వాటర్&వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కోర్సులో పీజీ డిప్లొమా(Y19) చదివిన విద్యార్థుల కోసం ‘వన్ టైం ఆపర్చునిటీ’ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2025 జనవరి 2 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, లేట్ ఫీ లేకుండా ఈనెల 26లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది. ఫీజు వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడవచ్చని తెలిపింది.
Similar News
News April 18, 2026
కృష్ణా: పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన మహిళలు

మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన ఘటన కృష్ణా(D) పెడనలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ పరిధిలో గృహ సముదాయాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్న మహిళలను అదుపులోకి తీసుకున్నామని SI బషీర్ చెప్పారు. ఆటలో పాల్గొన్న నలుగురు మహిళలు, ఇద్దరు పురుషుల నుంచి రూ.47,750 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. దొరికింది కొంత నగదే.. అక్కడి మహిళలు రూ.లక్షల్లో పందేలు కాస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి.
News April 18, 2026
ఇండస్ట్రియల్ నేరగాళ్లకు SP హెచ్చరికలు

బాపులపాడు మండలం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా (APIIC)నుSP విద్యాసాగర్ నాయుడు శుక్రవారం పరిశీలించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పోలీస్ ఔట్పోస్ట్ ఏర్పాటు, దొంగతనాలు, మహిళల ఉద్యోగుల భద్రత, బహిరంగ మద్యపానం వంటి సమస్యలపై చర్చించారు. మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ.. వేధింపులు, దొంగతనాలు, అక్రమ మద్యం సేవపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు.
News April 18, 2026
ఇండస్ట్రియల్ నేరగాళ్లకు SP హెచ్చరికలు

బాపులపాడు మండలం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా (APIIC)నుSP విద్యాసాగర్ నాయుడు శుక్రవారం పరిశీలించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పోలీస్ ఔట్పోస్ట్ ఏర్పాటు, దొంగతనాలు, మహిళల ఉద్యోగుల భద్రత, బహిరంగ మద్యపానం వంటి సమస్యలపై చర్చించారు. మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ.. వేధింపులు, దొంగతనాలు, అక్రమ మద్యం సేవపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు.


