News December 19, 2024
ఎల్లుండి నుంచి ఇంద్రకీలాద్రిపై దీక్షల విరమణ

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల కోసం ‘భవానీ దీక్ష 2024’ పేరుతో యాప్ను రూపొందించామని, ఇందులో ఆలయానికి సంబంధించిన సమాచారం ఉంటుందని చెప్పారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. రోజుకు సుమారు లక్ష మంది చొప్పున భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు.
Similar News
News November 3, 2025
బస్సు ప్రమాదంపై మోదీ విచారం.. పరిహారం ప్రకటన

TG: మీర్జాగూడ <<18184089>>ప్రమాదంపై<<>> ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
News November 3, 2025
బస్సు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

మీర్జాగూడ <<18183773>>బస్సు<<>> ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు పవన్ సైతం సానుభూతి ప్రకటించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
News November 3, 2025
ఈనెల 5న మెగా జాబ్ మేళా

AP: అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావొచ్చు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ జాబ్ మేళాలో 18 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.


