News December 19, 2024

తిరుపతి: అత్తను అత్యంత కిరాతకంగా చంపిన అల్లుడు

image

తిరుపతిలో అత్తను ఆమె అల్లుడు అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. అలిపిరి పరిధిలోని సింగాలగుంటకు చెందిన ద్రాక్షాయిని (55) కొడుకు, కోడలు తరచూ గొడవలు పడుతుండేవారు. గొడవలకు కారణం ద్రాక్షాయిని అని ఆమె కోడలి తమ్ముడు రాత్రి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 2, 2026

చిత్తూరు: తగ్గిన రిజిస్ట్రేషన్లు

image

జనవరి 1న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోయాయి. చిత్తూరు అర్బన్‌లో ఒక రిజిస్ట్రేషన్ కూడా జరగకపోగా, చిత్తూరు రూరల్ పరిధిలో 4 మాత్రమే అయ్యాయి. సాధారణ రోజుల్లో రెండు కార్యాలయాల్లో కలిపి 30-50 మధ్య రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. పండగ నెల కావడంతో క్రయ, విక్రయదారులు లేకపోవడంతో కార్యాలయాలు బోసిపోయాయి. జనవరి 1న సెలవుగా భావించి పలువురు రాలేదని అధికారులు చెప్పారు.

News January 2, 2026

చిత్తూరు MPకి 94 శాతం హాజరు

image

2025 సంవత్సరంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పార్లమెంటుకు 94 శాతం హాజరయ్యారు. మొత్తం 122 ప్రశ్నలను పార్లమెంటులో అడిగారు. ఏడు అంశాలకు సంబంధించిన డిబేట్స్‌లో ఆయన పాల్గొన్నారు.

News January 2, 2026

చిత్తూరు MPకి 94 శాతం హాజరు

image

2025 సంవత్సరంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పార్లమెంటుకు 94 శాతం హాజరయ్యారు. మొత్తం 122 ప్రశ్నలను పార్లమెంటులో అడిగారు. ఏడు అంశాలకు సంబంధించిన డిబేట్స్‌లో ఆయన పాల్గొన్నారు.