News December 19, 2024
వచ్చే నెలలో అమరావతి పనులు: మంత్రి నారాయణ

AP: జనవరిలో రాజధాని అమరావతి పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ పనులకు ఈ నెల 22 నుంచి టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. ‘హడ్కో రుణంతో చేపట్టే పనులు సంక్రాంతికి మొదలవుతాయి. అలాగే వరల్డ్ బ్యాంక్ నిధులతో చేసే పనులు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News February 1, 2026
ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన పాక్

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ను పాకిస్థాన్ సొంతం చేసుకుంది. నిన్న జరిగిన రెండో టీ20లో 90 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాక్ 198/5 రన్స్ చేయగా ఆసీస్ 108 రన్స్కే ఆలౌటైంది. తొలి టీ20లో పాక్ 22 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. 2018 తర్వాత ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలవడం పాకిస్థాన్కు ఇదే తొలిసారి. మూడో టీ20 ఇవాళ జరగనుంది.
News February 1, 2026
పాక్లో దాడులు.. 125 మంది మృతి

పాక్ అధీనంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో BLA రెబల్స్, ఆర్మీ మధ్య జరిగిన <<19013238>>దాడుల్లో<<>> 125 మంది చనిపోయారు. 12 ప్రాంతాల్లో BLA దాడులు చేసిందని, అందులో 18 మంది సెక్యూరిటీ సిబ్బంది, 15 మంది పౌరులు చనిపోగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరోవైపు 92 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు చెప్పాయి. అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదని సమాచారం.
News February 1, 2026
ప్రకృతి సేద్యంలో చీడపీడల కట్టడి ఎలా?

పర్యావరణానికి, ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ విధానంలో కూడా చీడపీడల సమస్య ఉంటుంది. రసం పీల్చే పురుగులు, ఆకుముడత, కాండం, కాయతొలిచే పురుగులు, వేరు పురుగుల ఉద్ధృతి కనిపిస్తోంది. వీటిని బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, నీమాస్త్రాలతో కట్టడి చేయవచ్చు. ఈ సహజ పురుగు మందుల తయారీ విధానం, ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.


