News December 19, 2024
మంచిర్యాల: పెద్దపులి సంచారం!
మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అటవీ శాఖ పాత మంచిర్యాల, ముల్కల్ల బీట్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. సఫారీ రోడ్ మీదుగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాపింగ్ కెమెరాకి పులి చిక్కింది. దీంతో పులి సంచరించిన ప్రదేశాల్లో పాదముద్రలు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో అడవిలోకి వెళ్లవద్దని, పత్తి చేనులోకి రైతులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News February 5, 2025
ఆదిలాబాద్: 35 మందిలో ఆరుగురు ఎంపిక
ఆదిలాబాద్లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం TSKC, TASK ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన లభించింది. ఈ జాబ్ మేళాలో హెచ్.ఈ.టీ.ఈ.ఆర్.ఓ లాబొరేటరీస్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్లో పోస్టులకు 35 మంది అభ్యర్థులు హాజరవ్వగా ఆరుగురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత తెలిపారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలన్నారు.
News February 5, 2025
ADB: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఆదిలాబాద్లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లాండసాంగి గ్రామ సమీపంలోని రహదారిపై మహారాష్ట్ర పాటన్ బోరికి చెందిన షాలిక్కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 5, 2025
గుడిహత్నూర్లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన భౌరే చిన్న గంగాధర్ (60) బైక్ పై ఆదిలాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సీతాగొంది సమీపంలో ఉన్న హైమద్ ధాబా నుంచి యు టర్న్ తీసుకుంటుండగా ఓ కారు వచ్చి ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు.