News December 19, 2024

SKLM: రథ సప్తమిని రాష్ట్ర పండుగ‌గా గుర్తింపు

image

ఆరోగ్య ప్ర‌దాత‌, ప్ర‌త్య‌క్ష దైవం అర‌స‌వ‌ల్లి శ్రీ సూర్య‌నారాయ‌ణస్వామి వారి ర‌థ‌స‌ప్తమి వేడుక‌ల‌ను రాష్ట్ర పండుగ‌గా ప్ర‌భుత్వం గుర్తిస్తూ గురువారం జీవో విడుద‌ల చేసింది. ఈ మేర‌కు MLA గొండు శంక‌ర్ విశాఖ-ఎ కాల‌నీలోని త‌న కార్యాల‌యం నుంచి గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్ర‌తీ ఏటా ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో సూర్య‌దేవుని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ర‌థ‌స‌ప్తమి వేడుక‌లు నిర్వహిస్తుంటామని తెలిపారు.

Similar News

News March 15, 2026

శ్రీకాకుళం: రేపటి నుంచి ఒంటి పూట బడులు

image

వేసవ తీవ్రత దృష్ట్యా మార్చి 16 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవి బాబు ఆదివారం తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ జీవో జారీ చేశారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు రేపటి నుంచి ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.

News March 15, 2026

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు

image

శ్రీకాకుళం జిల్లాలో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు విస్తృతంగా హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు హోటల్స్‌లో వినియోగిస్తే సీజ్ చేస్తున్నారు. దీంతోపాటు భారీగా ఫైన్ వేస్తున్నారు. డొమెస్టిక్ గ్యాస్ అక్రమ వినియోగం వల్ల గ్యాస్ కొరత సమస్యగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

News March 15, 2026

శ్రీకాకుళం: కాసులు కురిపిస్తున్న మొగలిరేకులు

image

శ్రీకాకుళంలోని ఉద్దానంలోని “మొగలి” డొంకలు సహజ రక్షణ కవచంలా తీరప్రాంతాన్ని కాపాడటంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు చక్కని ఆదాయం వనరుగా మారాయి. దట్టంగా పెరుగుతూ సహజ రక్షణ గోడగా నిలుస్తూ తీరప్రాంతాన్ని తుపాన్ల నుంచి కాపాడుతున్నాయి. మొగలిరేకులు నుంచి తయారుచేసే అత్తరుకి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో సీజన్లో కొన్ని కుటుంబాలు ఈ అత్తరు తయారిని కుటీర పరిశ్రమగా నిర్వహించి, మంచి ఆదాయం సంపాదిస్తున్నాయి.