News December 19, 2024

న్యాయ నిపుణులతో కేటీఆర్ చర్చలు.. రేపు క్వాష్ పిటిషన్?

image

TG: ఏసీబీ తనపై <<14924408>>కేసు నమోదు<<>> చేయడంతో మాజీ మంత్రి కేటీఆర్ కోర్టును ఆశ్రయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Similar News

News July 6, 2025

మహిళల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. ఎక్కడెక్కడ పెడతారంటే?

image

ఇటీవల బెంగళూరు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగి నగేశ్ ఆఫీస్‌లోని బాత్రూమ్‌‌లో మహిళల వీడియోలు చిత్రీకరిస్తూ పట్టుబడ్డాడు. అయితే సీక్రెట్ కెమెరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఎక్కువగా అద్దం వెనుక, తలుపు వద్ద, గోడ మూలల్లో, పైకప్పు సీలింగ్, బల్బులో, టిష్యూ పేపర్ బాక్స్‌లో, స్మోక్ డిటెక్టర్‌లో పెట్టే అవకాశం ఉందంటున్నారు. అప్రమత్తతతో వీటిని గుర్తించవచ్చని చెబుతున్నారు.

News July 6, 2025

ఇండియన్ మూవీస్.. 6 నెలల్లో రూ.5,360cr+ కలెక్షన్స్!

image

ఈ ఏడాది తొలి 6 నెలల్లో 856 భారతీయ సినిమాలు థియేటర్లలో రిలీజై ₹5,360కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. గత ఏడాది మొదటి 6 నెలలతో (₹5,260cr) పోలిస్తే ఇది కాస్త ఎక్కువే. తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ₹300crకు పైగా వసూళ్లతో టాప్‌లో ఉండగా ఓవరాల్‌గా ‘ఛావా’ ₹800crతో తొలి స్థానంలో ఉంది. ‘గేమ్ ఛేంజర్’ వంటి పెద్ద సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో బాక్సాఫీస్ వద్ద దక్షిణాది సినిమాల హవా కాస్త తగ్గింది.

News July 6, 2025

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: విద్యార్థులు 3 రోజులకు మించి స్కూళ్లకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 5 రోజుల కంటే ఎక్కువ బడికి రాకపోతే MEO, CRPలు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలని సూచించింది. టీచర్లు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపింది. టీచర్లు సెలవు పెడితే వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని అకడమిక్ పర్యవేక్షణ అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది.