News December 20, 2024

బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదం.. మానవ తప్పిదమే కారణం

image

మాజీ CDS బిపిన్ రావత్ 2021 DECలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని IAF ధృవీకరించింది. ఇందుకు సంబంధించిన రిపోర్టును తాజాగా లోక్ సభకు అందించింది. 2017-2022 మధ్య జరిగిన 34 ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదాల్లో 16 హ్యుమన్ ఎర్రర్ వల్లే జరిగాయని పేర్కొంది. TNలోని కన్నూరులో జరిగిన ప్రమాదంలో బిపిన్‌తో పాటు ఆయన భార్య మధులిక, మరో 11 మంది చనిపోయారు.

Similar News

News January 3, 2026

మరోసారి తండ్రి అయిన టాలీవుడ్ హీరో

image

టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ మరోసారి తండ్రి అయ్యారు. జనవరి 2న ఆయన భార్య అరుణ మగ బిడ్డకు జన్మనిచ్చారని సినీ వర్గాలు తెలిపాయి. చాలా కాలం తర్వాత ‘శంబాల’తో హిట్ అందుకున్న ఆయనకు సంతోషం రెట్టింపు అయింది. 2014లో ఆది, అరుణ వివాహం జరగ్గా, వారికి ఓ పాప ఉంది. కాగా శంబాల మూవీ వారం రోజుల్లో రూ.16.2 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

News January 3, 2026

కంది పండితే కరువు తీరుతుంది

image

మన భోజనంలో కందిపప్పు ప్రధానమైనది. ఇది బాగా పండితే ప్రతి ఇంట్లో నిల్వ ఉండి ఇతర కూరగాయలు లేకపోయినా పప్పు లేదా పప్పుచారుతో కడుపు నింపుకోవచ్చు. అలాగే కంది వర్షాభావ పరిస్థితులను, కరువును తట్టుకుని నిలబడి కరువు కాలంలో రైతుకు భరోసానిస్తుంది. పర్యావరణం పరంగా కంది పంట వల్ల భూమికి నత్రజని అంది నేల సారవంతమై తదుపరి పంటలకు మేలు జరుగుతుంది. ఇన్ని లాభాల వల్లే కంది పండితే కరువు తీరుతుంది అంటారు.

News January 3, 2026

గుడికి వెళ్లినప్పుడు నవగ్రహ ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి?

image

శివాలయాలు, హనుమాన్ దేవాలయాలకు వెళ్లినప్పుడు ముందుగా ఆ ఆలయంలోని ప్రధాన దైవాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాతే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శాస్త్రాల ప్రకారం మూలవిరాట్టును దర్శించి బయటకు వచ్చాక నవగ్రహ మండపం వద్దకు వెళ్లి పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయ్యాక మరోసారి ప్రధాన దైవాన్ని దర్శించుకుని, ఆపై ఇంటికి వెళ్లడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.