News December 20, 2024

ఇన్వెస్టర్లు లబోదిబో.. నిఫ్టీ 250Pts డౌన్

image

స్టాక్‌మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. వరుస నష్టాలతో ఇన్వెస్టర్లు అల్లాడుతున్నారు. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన నిఫ్టీ 100 Pts ఎగిసి 24065 వద్ద గరిష్ఠాన్ని తాకింది. వెంటనే 60 Pts మేర నష్టాల్లోకి జారుకుంది. ఆపై పుంజుకొని రేంజుబౌండ్లో కొనసాగింది. మళ్లీ నేలవైపు పరుగులుపెట్టింది. ప్రస్తుతం 250 Pts నష్టంతో 23710 వద్ద ట్రేడవుతోంది. 1000 Pts మేర పడ్డ సెన్సెక్స్ 850 Pts నష్టంతో 78,367 వద్ద కొనసాగుతోంది.

Similar News

News September 14, 2025

SBIలో 122 పోస్టులు

image

<>ఎస్బీఐ<<>> 122 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. ఇందులో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు 59, మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) 63 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు OCT 2వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.750, SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

News September 14, 2025

కేజీ చికెన్ ధర రూ.280.. ఎక్కడంటే?

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. TGలోని హైదరాబాద్‌, కామారెడ్డి, ఖమ్మంతో పాటు APలోని విజయవాడ, గుంటూరు, నంద్యాల, పల్నాడు, తూ.గో తదితర నగరాల్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.230-240కి విక్రయిస్తున్నారు. అత్యధికంగా తిరుపతిలో రూ.280, అత్యల్పంగా కాకినాడలో రూ.220-230గా ఉంది. మీ ఏరియాలో రేట్ ఎంత? COMMENT

News September 14, 2025

గొర్రెల్లో చిటుక వ్యాధి ఎలా వస్తుంది?

image

గొర్రెలకు సోకే ప్రమాదకరమైన వ్యాధుల్లో ‘చిటుక వ్యాధి’ ఒకటి. ఈ వ్యాధి సోకిన గొర్రెలు త్వరగా మరణిస్తాయి. అందుకే దీన్ని ‘చిటుక వ్యాధి’ అని పిలుస్తారు. ఇది ‘క్లాస్ట్రీడియం పర్ఫింజన్స్‌ టైప్‌-డి’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వర్షాకాలంలో తేమతో కూడిన పచ్చగడ్డిని గొర్రెలు తిన్నప్పుడు చిటుక వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు.