News December 20, 2024
పీసీ యాక్ట్ వర్తించదు.. HCలో కేటీఆర్ న్యాయవాది వాదనలు

TG: ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. KTRపై పెట్టిన పీసీ యాక్ట్ వర్తించదని, ఆయన లబ్ధి పొందినట్లు FIRలో లేదని కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం వాదించారు. రాజకీయ కక్షలో భాగంగానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.
Similar News
News November 10, 2025
రోడ్డు ప్రమాదాలపై కేంద్రం, NHAIకి SC నోటీసులు

ఇటీవల TG, రాజస్థాన్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీం కోర్టు విచారించింది. NHల నిర్వహణపై నివేదిక ఇవ్వాలని కేంద్రం, NHAIని ఆదేశించింది. రోడ్లపై వాహనాల పార్కింగ్ వల్లే ఈ ప్రమాదాలని జస్టిస్ JK మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిలో ఆయా రాష్ట్రాల CSలనూ పార్టీగా చేర్చాలని పేర్కొంది. రోడ్డు ప్రమాదాల్లో TGలో 19మంది, రాజస్థాన్లో 18మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.
News November 10, 2025
ధర్మేంద్ర హెల్త్పై రూమర్స్.. టీమ్ క్లారిటీ

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ <<18162519>>ధర్మేంద్ర<<>> ఇటీవల శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందని, మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది. వాటిని నటుడి టీమ్ ఖండించింది. ‘ఆయన కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముంబైలోని ఆస్పత్రికి రొటీన్ చెకప్కు వెళ్లగా ఇలాంటి వార్తలు వచ్చాయి’ అని క్లారిటీ ఇచ్చారు.
News November 10, 2025
న్యూస్ రౌండప్

*రేపు HYD ఘట్కేసర్ NFC నగర్లో అందెశ్రీ అంత్యక్రియలు. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
*దేవాలయాల్లో తొక్కిసలాట నివారణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
*శంషాబాద్ విమానాశ్రయంలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్. 2.70 లక్షల ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా పునర్నిర్మాణం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
*లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


