News December 20, 2024

విశాఖ: ‘మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి’

image

మధ్యవర్తిత్వం విధానం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. విశాఖ నగరం న్యాయస్థానాల భవన సముదాయంలో శుక్రవారం ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన న్యాయమూర్తులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కక్షిదారులు న్యాయవాదులు న్యాయమూర్తులు కలిసి మధ్యవర్తిత్వం ద్వారా ఎక్కువ కేసులు పరిష్కరించాలని సూచించారు.

Similar News

News February 5, 2025

రాయగడ డివిజన్ పరిధిలో రైల్వే లైన్లు ఇవే..

image

రాయగడ డివిజన్ పరిధిలో <<15366937>>రైల్వే లైన్లు<<>> రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
➤ కొత్తవలస- బచేలి/ కిరండోల్
➤ కూనేరు-తెరువలి జంక్షన్
➤ సింగ్ పూర్ రోడ్-కొరాపుట్ జంక్షన్
➤ పర్లాకిముండి- -గుణపూర్ రైల్వే‌స్టేషన్‌ను రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చారు.

News February 5, 2025

KGHలో రౌడీషీటర్ హల్‌చల్

image

విశాఖ కేజీహెచ్‌లో రౌడీషీటర్ బుధవారం హల్‌చల్ చేశాడు. ఆస్పత్రిలో పనిచేసే రౌడీషీటర్ రాజును విధుల నుంచి తప్పించారు. దీంతో రాజు పిల్లల వార్డుకు ఆక్సిజన్ వెళ్లే పైప్‌లైన్‌ను కట్ చేసే ప్రయత్నం చేశాడు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్‌ను కత్తితో బెదిరించాడు. మరో ఇద్దరు రాజుకు సహకరించగా ఆసుపత్రి వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు.

News February 5, 2025

గాజువాకలో ఫార్మా ఉద్యోగి మృతి.. ఐదుగురు అరెస్ట్

image

గాజువాకలో ఫార్మసిటీ ఉద్యోగి భాస్కరరావు మృతి కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని గాజువాక సీఐ పార్థసారథి తెలిపారు. వీరు హింసించి, ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్లే అతను మృతి చెందాడని ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందన్నారు. ఈ కేసులో ఏ-1 హేమంత నర్సింగ్ కుమార్(కూర్మన్నపాలెం), ఏ-2 ప్రియాంక(గాజువాక), ఏ-3 కర్రి లక్ష్మి(శ్రీనగర్), ఏ-4 హేమ శేఖర్, ఏ-5గా మణికంఠను రిమాండ్‌కు తరలించామన్నారు. 

error: Content is protected !!