News December 21, 2024
ముదురుతున్న శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యల వ్యవహారం

BRS నేత <<14920837>>శ్రీనివాస్ గౌడ్<<>> వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. ఆయనపై కేసు నమోదు చేయాలని TTD భావిస్తోంది. ఈ మేరకు ఆయన వ్యాఖ్యలను విజిలెన్స్ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు విషయమై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 24న జరిగే TTD బోర్డు సమావేశంలో దీనిపై చర్చిస్తారని టాక్. తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Similar News
News September 22, 2025
US H-1Bకి పోటీగా చైనా ‘K వీసా’!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ను ఆకర్షించేందుకు చైనా కొత్తగా ‘K వీసా’ను ప్రవేశపెట్టింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ & మ్యాథమెటిక్స్ (STEM) రంగాల్లో స్కిల్డ్ మ్యాన్ఫోర్స్ కోసం OCT 1 నుంచి ఈ వీసాను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. నిపుణులు దీన్ని US H-1B వీసాకు పోటీగా అభివర్ణిస్తున్నారు. వీసా ఫీజును US లక్ష డాలర్లకు పెంచడం చైనాకు కలిసొచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
News September 22, 2025
రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
News September 21, 2025
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ ఫైర్

GSTకి సంబంధించి PM మోదీ <<17785063>>వ్యాఖ్యలపై<<>> కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్ అయ్యారు. ‘కాంగ్రెస్ అమలు చేసిన సింపుల్ GSTకి బదులు మీ ప్రభుత్వం గబ్బర్ సింగ్ ట్యాక్స్ విధించింది. 8 ఏళ్లలో 9 శ్లాబ్స్ పెట్టి రూ.55 లక్షల కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు సేవింగ్స్ ఫెస్టివల్ అంటూ రూ.2.5 లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నారు. పెద్ద గాయాలకు చిన్న బ్యాండ్ ఎయిడ్ వేయాలని చూస్తున్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.