News December 21, 2024
PAL ల్యాబ్లను సద్వినియోగం చేసుకోండి: డీఈవో

వెల్దుర్తి జడ్పీ బాలుర పాఠశాలను శనివారం డీఈవో శ్యాముల్ పాల్ తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన PAL ల్యాబ్లను, తరగతి గదిని తనిఖీ చేశారు. తరగతి గది దుమ్ము, ధూళి, చెత్తాచెదారంతో ఉండి కనీస వెలుతురు లేకుండా ఉండటంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు బోధనను, టెక్నాలజీని సులభతరంగా అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం PAL ల్యాబ్లను తీసుకుని వచ్చిందన్నారు.
Similar News
News November 11, 2025
హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమిని గుర్తించండి: మంత్రి

హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమిని గుర్తించాలని అధికారులను మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమి గుర్తింపు అంశంపై కలెక్టర్ సిరితో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
News November 10, 2025
ఢిల్లీలో పేలుడు.. అప్రమత్తమైన కర్నూలు పోలీసులు

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు నేపథ్యంలో కర్నూల్ వ్యాప్తంగా అప్రమత్తతా చర్యలు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. కర్నూలు, గుత్తి పరిధిలోని పెట్రోల్ బంకులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్ గేట్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించారు.
News November 10, 2025
కర్నూలు జిల్లాకు పతకాలు

ఈనెల 7 నుంచి 9 వరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన 69వ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్ 19, 14 విభాగాలలో రైఫిల్ షూటింగ్ పోటీలలో జిల్లా క్రీడాకారులు పతకాల పంట సాధించినట్లు జిల్లా కార్యదర్శి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ విజేతలుగా నిలిచిన రామ్ జిగ్నేష్, నక్షత్ర, అన్నా జెన్ క్రీడాకారులను సత్కరించారు. జాతీయ స్థాయిలో సత్తా చాటాలన్నారు.


