News December 22, 2024
అమిత్ షాను పిచ్చి కుక్క కరిచింది: ప్రియాంక్
అంబేడ్కర్పై వివాదాస్పద <<14915470>>వ్యాఖ్యలు<<>> చేసిన అమిత్ షాపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఆయనను పిచ్చి కుక్క కరవడంతోనే ఇలా మాట్లాడారని దుయ్యబట్టారు. ‘7 జన్మల్లో భగవంతుడిని జపిస్తే స్వర్గంలో స్థానం లభిస్తుందో లేదో తెలియదు. కానీ ఈ జన్మలో అంబేడ్కర్ను స్మరిస్తే రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం పొందుతాం. అంబేడ్కర్, సమానత్వం అనేవి షా ఆలోచనల్లో లేకపోవడమే అసలు సమస్య’ అని పేర్కొన్నారు.
Similar News
News February 5, 2025
దానం నివాసంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ!
TG: అసెంబ్లీ సెక్రటరీ నోటీసుల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశమయ్యారు. న్యాయపరంగా ముందుకెళ్లే అంశం, అసెంబ్లీ సెక్రటరీ, సుప్రీంకు సమాధానం ఇవ్వడంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
News February 5, 2025
అకౌంట్లలోకి రైతుభరోసా డబ్బులు
TG: రైతుభరోసా నిధుల జమను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లలో ఇవాళ్టి నుంచి డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ నిధులు జమ అవుతాయన్నారు.
News February 5, 2025
రేపు ఎమ్మెల్యేలతో రేవంత్, మున్షీ భేటీ
TG: రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధిష్ఠానం భేటీ కానుంది. వారిని నాలుగు గ్రూపులుగా విడదీసి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, కులగణనపై ప్రచారం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.