News December 23, 2024
ఉమ్మడి జిల్లా జడ్పీటీసీల ఆత్మీయ సమావేశం

విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీటీసీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మునగపాక మండలం వెంకటాపురంలో ఈ ఆత్మీయ కలయిక జరిగింది. ఈ కార్యక్రమంలో బుచ్చియపేట జడ్పీటీసీ, జిల్లా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు దొండా రాంబాబు, సీనియర్ జడ్పీటీసీ కర్రి సత్యం పాల్గొన్నారు. జడ్పీటీసీల ఫ్లోర్ లీడర్గా పరవాడ జడ్పీటీసీ పైలా సన్యాసి రాజును ఎన్నుకున్నామని రాంబాబు తెలిపారు.
Similar News
News January 21, 2026
జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ 3.0 ప్రారంభం

జీవీఎంసీ మరో ముందడుగు వేసింది. ఆపరేషన్ లంగ్స్-3.0 పేరిట సెల్లార్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై కొరడా ఝులిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్డ్ మంగళవారం తెలిపారు. చాలా భవనాల్లో సెల్లార్లు వ్యాపార నిలయాలుగా మారడంతో రహదారులపై పార్కింగ్ సమస్య తలెత్తుతుందని, వెంటనే వీటిని ఆయా యజమానులు తొలగించాలన్నారు. లేదంటే జీవీఎంసీ తొలగిస్తుందని హెచ్చరించారు.
News January 20, 2026
జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ 3.0 ప్రారంభం

జీవీఎంసీ మరో ముందడుగు వేసింది. ఆపరేషన్ లంగ్స్-3.0 పేరిట సెల్లార్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై కొరడా ఝులిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్డ్ మంగళవారం తెలిపారు. చాలా భవనాల్లో సెల్లార్లు వ్యాపార నిలయాలుగా మారడంతో రహదారులపై పార్కింగ్ సమస్య తలెత్తుతుందని, వెంటనే వీటిని ఆయా యజమానులు తొలగించాలన్నారు. లేదంటే జీవీఎంసీ తొలగిస్తుందని హెచ్చరించారు.
News January 20, 2026
విశాఖ కలెక్టర్కు అవార్డు

విశాఖపట్నం జిల్లా ఎన్నికల అధికారి ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఉత్తమ ఎన్నికల జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. 2025లో నిర్వహించిన ఎన్నికల్లో అత్యుత్తమ విధానాలను అమలు చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన పేరును నామినేట్ చేశారు. జనవరి 25న విజయవాడలో జరగనున్న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.


