News March 16, 2024
ఎన్నికలకు ముందే ప్రజలు ఫలితాలు ప్రకటించారు: మోదీ
TG: ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వకముందే ప్రజలు ఫలితాలు ప్రకటించారని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తామని తేల్చారని ఆయన పేర్కొన్నారు. నాగర్కర్నూల్లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News September 29, 2024
ఏపీకి 30 ESI ఆస్పత్రులు: పెమ్మసాని
APకి 30 ESI ఆస్పత్రులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. భూకేటాయింపులు పూర్తైన వెంటనే వీటి నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. అమరావతిలో రూ.250 కోట్లతో 400 పడకల ESI ఆస్పత్రి రాబోతోందన్నారు. అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి సుమారుగా వంద నిర్మాణాలు జరగాల్సి ఉందని, ఆయా శాఖలతో సంప్రదించి పనులు వేగంగా జరిగేలా చూస్తామన్నారు.
News September 29, 2024
నటుడి విడాకులకు నేను కారణం కాదు: ఫీమేల్ సింగర్
తనతో సంబంధం వల్లే నటుడు జయం రవి ఆయన భార్యకు విడాకులు ఇచ్చారన్న <<14159198>>ప్రచారంపై<<>> సింగర్ కెనీషా మరోసారి స్పందించారు. ‘ఆయనకు నాకు మధ్య శారీరక సంబంధం లేదు. మా మధ్య ఉన్నది కేవలం వ్యాపారపరమైన సంబంధమే. ఆయన నాకు మంచి మిత్రుడు. రవి విడాకుల నిర్ణయానికి నేను కారణం కాదు. ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు’ అని ఓ ఇంటర్వ్యూలో కోరారు.
News September 29, 2024
అక్టోబర్ 1న DEECET సర్టిఫికెట్ వెరిఫికేషన్
TG: రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అక్టోబర్ 1న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. క్వాలిఫై అయిన వారు సంబంధిత జిల్లాల్లోని డైట్ కాలేజీల్లో వెరిఫికేషన్ చేయించుకోవాలి. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.inను చూడండి.