News March 16, 2024
ఎన్నికలకు ముందే ప్రజలు ఫలితాలు ప్రకటించారు: మోదీ

TG: ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వకముందే ప్రజలు ఫలితాలు ప్రకటించారని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తామని తేల్చారని ఆయన పేర్కొన్నారు. నాగర్కర్నూల్లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News March 7, 2026
వార్ ఎఫెక్ట్.. వంట గదిలో ధరల ‘మంట’

గల్ఫ్ యుద్ధం ప్రభావం ధరల రూపంలో మనపై పడుతోంది. తాజాగా సిలిండర్ <<19316911>>పెంపు<<>> దీనికి నిదర్శనం. భారత్తో పాటు జపాన్, చైనా, యూరప్ దేశాలకు ఖతర్ ఉత్పత్తి కేంద్రం నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(LNG), అనుబంధ ప్రొడక్టులు సప్లై అవుతాయి. వార్ నేపథ్యంలో ప్రొడక్టివిటీని నిలిపివేస్తున్నామని ఇటీవల ఖతర్ <<19299424>>ప్రకటించింది<<>>. దీంతో ఇప్పటికే యూరప్, ఆసియాలో గ్యాస్ ధరలు పెరగగా తాజాగా మన దేశంలోనూ సామాన్యులపై భారం పడింది.
News March 7, 2026
గ్యాస్ సరఫరా ఆపకండి.. IOCLకు TTD లేఖ!

AP: యుద్ధం వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగంపై కేంద్రం <<19309548>>నియంత్రణ<<>> నేపథ్యంలో TTD అధికారుల్లో ఆందోళన మొదలైంది. నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని IOCLను కోరింది. లేదంటే అన్న ప్రసాదాల తయారీతో పాటు ఇతర అవసరాలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందని లేఖ రాసినట్లు సమాచారం. TTDని ఆధ్యాత్మిక పరిధిలో ఉంచి సరఫరాను కొనసాగించాలని కోరగా IOCL సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
News March 7, 2026
భారీగా పెరిగిన సిలిండర్ ధరలు

వంట గ్యాస్, కమర్షియల్ LPG సిలిండర్ ధరలను కేంద్రం భారీగా పెంచింది. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్పై 60 రూపాయలు, 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై ₹115 పెంచింది. ఈ కొత్త ధరలు ఈరోజు నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్లో 14.2kg డొమెస్టిక్ సిలిండర్ ధర ₹905 నుంచి ₹965కు, 19kg కమర్షియల్ సిలిండర్ ధర ₹1,961 నుంచి ₹2,076కు చేరింది.


