News December 23, 2024

మోదీకి అంతర్జాతీయ పురస్కారాలు@20

image

ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్ రాజు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ను అందజేశారు. దీంతో ఇప్పటివరకు ఆయన అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 20కి చేరింది. ఆయనకు గతంలో బార్బడోస్, గయానా, డొమినికా, నైజీరియా, రష్యా, భూటాన్, ఫ్రాన్స్, US, UAE తదితర దేశాలు పురస్కారాలను అందించాయి.

Similar News

News September 22, 2025

H1B వీసాల ప్రభావం.. ఐటీ షేర్లు ఢమాల్

image

H1B వీసాల ఫీజు పెంపు ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. సెన్సెక్స్ 300 పాయింట్లు కోల్పోయి 82,363 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయి 25,264 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా H1B వీసాల ప్రభావంతో టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫోసిస్, HCL టెక్ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, అదానీ పోర్ట్స్, ఎటర్నల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

News September 22, 2025

కారణం లేకుండా మాపైకి రావడంతో దీటుగా బదులిచ్చా: అభిషేక్

image

ASIA CUP: నిన్నటి భారత్, పాక్ మ్యాచ్‌ సందర్భంగా అభిషేక్ శర్మ- రౌఫ్, అఫ్రీది మధ్య హీటెడ్ డిస్కషన్ జరిగింది. వీటిపై అభిషేక్ స్పందిస్తూ.. ‘కారణం లేకుండా పాక్ ప్లేయర్లు మాపైకి వచ్చారు. అది నాకు నచ్చలేదు. అందుకే వారికి దీటుగా బదులిచ్చా. జట్టు విజయం కోసం పోరాడా’ అని చెప్పారు. గిల్‌తో భాగస్వామ్యంపై మాట్లాడుతూ.. ‘ఇద్దరం స్కూల్ డేస్ నుంచి కలిసి ఆడుతున్నాం. ఒకరి ఆటను మరొకరం గౌరవిస్తాం’ అని చెప్పారు.

News September 22, 2025

KBCలో రూ.50లక్షలు గెలుచుకున్న కార్పెంటర్

image

అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో ఓ సామాన్యుడు కోటీశ్వరుడు కాకపోయినా లక్షాధికారి అయ్యాడు. పంజాబ్‌లోని హుస్సేన్‌పూర్‌కు చెందిన చందర్‌పాల్ కార్పెంటర్ వర్కర్. పెద్దగా చదువుకోకపోయినా వివిధ అంశాలపై జ్ఞానం పొంది, కేబీసీలో పాల్గొన్నాడు. అమితాబ్ అడిగిన రూ.50 లక్షల ప్రశ్నకు ఆడియన్స్ పోల్, 50-50 ఆప్షన్లు వాడుకొని సరైన సమాధానం చెప్పాడు. పిల్లల చదువుకు, వ్యాపార విస్తరణకు డబ్బును ఉపయోగిస్తానన్నాడు.