News December 23, 2024
40 లక్షల మందికి రైతు భరోసా కట్!: BRS

TG: రైతు భరోసా పథకానికి పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలిచ్చిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ఒకవేళ ఈ నిబంధనలే అమలు చేస్తే దాదాపు 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్ అవుతుందని పేర్కొంది. తమ హయాంలో 70 లక్షల మందికి రైతు బంధు ఇచ్చామని, రైతు బంధు కంటే పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య 40 లక్షలు తక్కువని తెలిపింది.
Similar News
News January 7, 2026
ఖమ్మం: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..?

సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఖమ్మం రీజియన్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 9 నుంచి 20 వరకు మొత్తం 1,368 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్ఎం సరిరామ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చే వారికోసం 799 బస్సులు, తిరుగు ప్రయాణంలో 569సర్వీసులు అందుబాటులో ఉంటాయని వివరించారు. వీటిలో 601బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.
News January 7, 2026
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్?

APలో మరో మెగా DSCకి రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది 9వేల మందికిపైగా టీచర్లు రిటైర్ కానున్నారు. అలాగే 9,200 ప్రైమరీ స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా మార్చిన తర్వాత ఉపాధ్యాయులు అవసరమని అధికారులు గుర్తించారు. దీంతో FEB రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈసారి DSCలో కొత్తగా ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానంపై ఓ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు సమాచారం.
News January 7, 2026
‘MSVG’ ప్రమోషన్లకు దూరంగా చిరు.. అందుకేనా?

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల వెన్నెముక భాగంలో చిన్న సర్జరీ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. నొప్పి నుంచి రిలీఫ్ కోసం HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించుకున్నారని టాక్. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్లకు నేరుగా హాజరు కావడం లేదని టీటౌన్ వర్గాల్లో డిస్కషన్. త్వరలో జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


