News December 23, 2024
కళకళలాడిన STOCK MARKETS

వరుస నష్టాలకు తెరపడింది. స్టాక్మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 78,540 (+498), నిఫ్టీ 23,753 (+165) వద్ద ముగిశాయి. ఒకానొక దశలో నిఫ్టీ 270 పాయింట్ల మేర పెరగడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు పుంజుకోవడం, హెవీవెయిట్స్లో పొజిషన్లే ఇందుకు కారణం. నిఫ్టీ ADV/DEC రేషియో 32:18గా ఉంది. JSWSTEEL, ITC, HINDALCO, TRENT, HDFC BANK టాప్ గెయినర్స్.
Similar News
News September 22, 2025
దసరా తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్?

TG: దసరా తర్వాత జూబ్లీహిల్స్ బైపోల్కు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ తొలివారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల <<17788984>>డేట్స్<<>> ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దాంతో పాటు జూబ్లీహిల్స్ సహా దేశంలోని మరిన్ని నియోజకవర్గాలకు షెడ్యూల్ ప్రకటిస్తుందని సమాచారం. ఇప్పటికే ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, తదితర ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈసీకి పూర్తి నివేదిక సమర్పించారు.
News September 22, 2025
వ్యవసాయంలో ఎర పంటల ప్రాధాన్యం

కొన్ని రకాల పంటలు కొన్ని పురుగులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆ పంటలను ప్రధాన పొలంలో వేస్తే పురుగు రాకను, ఉనికిని వెంటనే గుర్తించవచ్చు. అటువంటి పంటలను ఎరపంటలు లేదా ఆకర్షక పంటలు (Trap Crop) అంటారు. ఎరపంటలు వేయడం వల్ల ప్రధాన పంటపై పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. అలాగే పురుగుమందులు వాడాల్సిన అవసరం, వాటి కొనుగోలుకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. రైతులు ఈ ఎర పంటల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రధాన పంటలో వేసుకోవాలి.
News September 22, 2025
ఏ పంటల్లో ఎలాంటి ఎర పంటలను వేస్తే మంచిది?

☛ పత్తి, వేరుశనగ పంటల్లో ఆముదపు పంటను ఎరపంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను సులభంగా నివారించవచ్చు.
☛ క్యాబేజీలో సాధారణంగా వచ్చే డైమండ్ బ్యాక్ మాత్ను ఆవాలు పంటను వేసి నివారించవచ్చు.
☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ అలసంద పంటలో ఆవాలు ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.