News March 16, 2024
ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాది వద్ద నివాళులు అర్పించేందుకు బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో సీనియర్ నాయకులు అభ్యర్థులను ప్రకటించనున్నారు.
Similar News
News February 5, 2026
కడప: అప్పుడే మొదలైన ఎండలు.!

కడప జిల్లాలో అప్పుడే ఎండాకాల ప్రభావం మొదలైంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు పలు చోట్ల మండుతున్నాయి. బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాదాపు 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణం పొడిగా ఉంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. మీ ఊరిలోనూ ఇలాగే ఉందా.?
News February 5, 2026
కడప: ఏడుగురు అరెస్ట్

కలసపాడు మండలం పెండ్లిమర్రిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సుభాన్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు పెండ్లిమర్రిలో రెండు పేకాట స్థావరాలపై దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.7500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
News February 5, 2026
కడప జిల్లా ఫారెస్ట్ భూముల్లో ఆక్రమణ.. ఇలా.!

ప్రొద్దుటూరులో కలిసిపోయేలా రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయి. అప్పటి CPI నేత MP ఎద్దుల ఈశ్వరరెడ్డి భూ-పోరాటాలు చేసి అక్కడ పేదలతో గుడిసెలు వేయించారు. ఆ ప్రాంతం ఈశ్వరరెడ్డి నగర్గా ప్రభుత్వ రికార్డుల్లోకెక్కింది. కాలక్రమేణా అక్కడ గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు వచ్చాయి. ప్రభుత్వాలు అక్కడి ప్రజలకు రోడ్డు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పాఠశాల తదితర మౌలిక వసతులు కల్పించాయి. ఇలా ఆక్రమణకు గురయ్యాయి.


