News March 16, 2024

పని ఒత్తిడికి ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లు సైతం బలి!

image

IIT, IIM వంటి టాప్ విద్యాసంస్థల్లో చదివిన వారు కూడా పని ఒత్తిడికి బలైపోతున్నారు. ఇటీవల ముంబైలోని మెక్‌కిన్సే & కంపెనీలో సౌరభ్ (25) ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం ఇందుకు ఉదాహరణ. ఇతను ఐఐటీ మద్రాస్, ఐఐఎం కలకత్తాలో చదువుకున్నాడు. మనుషులను ఓ పని యంత్రంలా తయారు చేసే విద్యావ్యవస్థ మారాలని, కంపెనీలు ఉద్యోగులకు తగిన వాతావరణం కల్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మీ కామెంట్?

Similar News

News November 1, 2025

85% మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు స్థానికులకే: దామోదర

image

TG: మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో‌ 85 శాతం రాష్ట్ర విద్యార్థులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఇప్పటివరకూ మేనేజ్‌మెంట్ కోటా సీట్లన్నీ ఆల్ ఇండియా కేటగిరీలో భర్తీ చేశారు. తాజా నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318 మెడికల్ పీజీ, 70 డెంటల్ పీజీ సీట్లు దక్కనున్నాయి.

News November 1, 2025

లవ్ స్టోరీ చెప్పేసిన అల్లు శిరీష్

image

<<18163585>>నిశ్చితార్థం<<>> చేసుకున్న టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ తన లవ్ స్టోరీని ఇన్‌స్టాలో వెల్లడించారు. 2023లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ సమయంలో నితిన్, శాలిని కందుకూరి ఇచ్చిన పార్టీలో నయనికను కలుసుకున్నట్లు తెలిపారు. అలా ప్రేమ మొదలవ్వగా సరిగ్గా రెండేళ్లకు ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు చెప్పారు. ‘‘భవిష్యత్తులో నా పిల్లలు మా కథ ఎలా ప్రారంభమైందని అడిగితే ‘ఇలానే మీ అమ్మను కలిశా’ అని చెబుతా’’ అంటూ రాసుకొచ్చారు.

News November 1, 2025

గర్భవతిని చేసేవారు కావాలంటూ ₹11 లక్షలకు టోకరా

image

సైబర్ నేరగాళ్లు వేర్వేరు మార్గాల్లో మోసాలు చేస్తున్నారు. తాజాగా ‘గర్భవతిని చేయగల పురుషుడి కోసం ఎదురుచూస్తున్నాను’ అనే ఆన్‌లైన్ యాడ్ ఇచ్చి పుణేకు చెందిన కాంట్రాక్టర్‌ను ₹11Lకు బురిడీకొట్టించారు. ఆయన కాల్ చేయగా ఓ యువతి తన వీడియో పంపింది. ఆపై సైబర్ ముఠా ఫీజుల పేరిట డబ్బు వసూలు చేసింది. అనుమానంతో పోలీసుల్ని ఆశ్రయించగా మోసమని తేలింది. ప్రెగ్నెంట్ జాబ్, ప్లేబాయ్ పేరిట ఇది జరుగుతున్నట్లు గుర్తించారు.