News March 16, 2024
రామభద్రపురంలో దంపతులపై దాడి.. బంగారం చోరీ
రామభద్రపురం గ్రామంలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న దంపతులు రుద్రాక్షుల సత్యన్నారాయణ, అనురాధలపై కత్తితో దాడి చేసి.. అనురాధ చెయ్యిని విరిచి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంచుకెళ్ళారు. ఆ తర్వాత దంపతులు బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News September 29, 2024
ఏయూ: ‘అక్టోబర్ 7 నుంచి దసరా సెలవులు’
ఏయూతో పాటు అనుబంధ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ఈ.ఎన్ ధనుంజయ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 7 (సోమవారం) నుంచి 12(శనివారం) వరకు దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 14(సోమవారం) తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
News September 29, 2024
విజయనగరం: ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య
పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన లంకలపల్లి దుర్గారావు(39) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఎన్.ఏం.ఆర్గా పనిచేస్తున్న దుర్గారావు మానసిన సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 29, 2024
సౌర విద్యుత్పై అవగాహన కల్పించాలి: VZM జేసీ
ప్రతీ ఇంట్లో సౌర విద్యుత్ వినియోగించుకొనే విధంగా వినియోగదారులను చైతన్యపరచాలని జేసీ ఎస్.సేతుమాధవన్ కోరారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం అమలుపై శనివారం సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండలాల వారీగా పథకం అమలును సమీక్షించారు.