News December 24, 2024
రాజమండ్రి: కళ్ల ముందే కొడుకు మృతి.. రోదించిన తల్లి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735002155108_1240-normal-WIFI.webp)
రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు పిడింగొయ్యికి చెందిన నరేశ్ (20) అనే వ్యక్తి తన తల్లితో కలిసి బైక్పై వెళ్తుండగా కవలగొయ్యి జంక్షన్ వద్ద లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన నరేశ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. దీంతో తల్లి రోదన చూపరులకు కన్నీరు తెప్పించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బొమ్మూరు పోలీసులు తెలిపారు.
Similar News
News February 5, 2025
రాజమండ్రి: ఇంటర్, 10వ తరగతి పరీక్షలపై కలెక్టర్ సమావేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738742956824_51761473-normal-WIFI.webp)
తూ.గో జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 43,754 మంది 51 పరీక్షా కేంద్రాల్లో, 10వ తరగతి పరీక్షలకు 25,723 మంది 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
News February 5, 2025
పందలపాక హత్య కేసులో నిందితుడి తల్లి అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738723176982_934-normal-WIFI.webp)
బిక్కవోలు మండలం పందలపాకలో గత నెల 29న హత్యకు గురైన లలితేశ్వరి కేసులో నిందితుడు తల్లి గుంతికోలు వరలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో ఆమె పాత్ర ఉన్నట్లుగా విచారణలో తేలడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు అనపర్తి సీఐ సుమంత్ తెలిపారు. వరలక్ష్మి కుమారుడు దుర్గాప్రసాద్ లలితేశ్వరిని కేబుల్ వైర్ మెడకు బిగించి చంపిన సంగతి విదితమే. ఈ హత్యలో మరికొందరి పాత్ర ఉందని గ్రామ మహిళలు ఇటీవల ఆందోళన చేశారు.
News February 5, 2025
విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738718186539_934-normal-WIFI.webp)
విద్యార్థినిపై అత్యాచారం కేసులో జూనియర్ లెక్చరర్ వేదాల వినయ్ మంగళవారం పోలీసులకు లొంగిపోయాడు. కేసు వివరాలను కొవ్వూరులో DSP దేవకుమార్ తెలిపారు. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న వినయ్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీలో జూ.లెక్చరర్గా పని చేస్తున్నారు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఇంటర్ సెకండియర్ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ నెల 28న విజయవాడలో లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.