News March 16, 2024
నాగర్కర్నూల్ ప్రజలు బీజేపీని గెలిపించాలి: మోదీ

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా NGKLలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎన్నికలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా బీజేపీ గాలి వీస్తోందన్నారు. నాగర్కర్నూల్ ప్రజలు ఈసారి బీజేపీని గెలిపించాలని కోరారు. నిన్న మల్కాజ్ గిరిలో రోడ్ షో బ్రహ్మాండంగా జరిగిందన్నారు. ప్రజలు వీధుల్లో బారులు తీరి బీజేపీకి మద్దతు తెలిపారన్నారు. BRS పట్ల కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు.
Similar News
News August 20, 2025
MBNR: PG పరీక్షలు.. 1792 మంది హాజరు

పాలమూరు విశ్వవిద్యాలయంలో పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్, పరీక్షల నియంత్రణ అధికారిణి డా.ప్రవీణ, పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డా.డి.మధుసూదన్ రెడ్డి, అబ్జర్వర్ డా.నూర్జహాన్ పరివేక్షించారు. మొత్తం 1911 మంది విద్యార్థులకు గాను.. 1,792 మంది హాజరయ్యారని, 64 మంది గైహాజరయ్యారని ఆమె తెలిపారు.
News August 20, 2025
MBNR: వినాయక చవితి.. DSP కీలక సూచనలు

గణేష్ విగ్రహా మండప నిర్వాహకులకు డీఎస్పీ వెంకటేశ్వర్లు కీలక సూచనలు చేశారు.
✒DJలు వినియోగించరాదు.
✒మండపాల వద్ద CCTV కెమెరాలు అమర్చాలి.
✒భక్తుల కోసం క్యూ లైన్, బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలి.
✒రోడ్లపై, కాలిబాటలపై విగ్రహాలను పెట్టరాదు.
✒కేవలం భక్తి గీతాలే వాడాలి.
✒రా.10:00-ఉ.6:00 వరకు స్పీకర్లు నిషేధం.
✒మండపంలో ఎమర్జెన్సీ ల్యాంప్ తప్పనిసరి.
✒వాలంటీర్లందరికి ఫొటో ఐడీ కార్డులు ఉండాలన్నారు.
News August 20, 2025
MBNR: భరోసా సెంటర్లదే కీలకపాత్ర: ఇందిర

మహబూబ్నగర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో భరోసా కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారిణి ఇందిర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భరోసా సెంటర్లు మహిళలు, చిన్నారులు, వృద్ధులు వంటి బలహీన వర్గాల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జరీనా, DM&HO కృష్ణ, అదనపు ఎస్పీ బి.ఎన్.రత్నం పాల్గొన్నారు.