News March 16, 2024
చిత్తూరు: సిట్టింగ్లకే అవకాశం

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సిట్టింగ్ ఎంపీలకే వైసీపీ మరో అవకాశం ఇచ్చింది. తిరుపతి నుంచి గురుమూర్తి, చిత్తూరు నుంచి రెడ్డప్ప, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రెడ్డప్ప 2019లో, గురుమూర్తి ఉపఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఎంపీలుగా ఎన్నికయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి 2014, 19లో రాజంపేట MPగా ఎన్నికయ్యారు. ఆయన మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Similar News
News January 1, 2026
చిత్తూరు కలెక్టర్కు శుభాకాంక్షల వెల్లువ

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ను పలువురు అధికారులు గురువారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బొకేలు, పండ్లు అందజేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో JC విద్యాధరి, డీఆర్వో మోహన్ కుమార్, మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, ఎస్ఎస్పీఎ వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఐఅండ్ పీఆర్ అధికారి వేలాయుధం తదితరులు ఉన్నారు.
News January 1, 2026
అనాధలతో చిత్తూరు SP న్యూ ఇయర్ వేడుకలు

నూతన సంవత్సర వేడుకలు అనాధలతో కలిసి ఎస్పీ తుషార్ డూడీ గురువారం నిర్వహించారు. చిత్తూరు తపోవణంలో అనాధ పిల్లలు, వృద్ధులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. పిల్లలకు కేక్, వృద్ధులకు పండ్లు పంచిపెట్టారు. అనంతరం పిల్లలతో ఆయన ముచ్చటించి వారి ఆశయాలపై ఆరా తీశారు. క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని చెప్పారు. వృద్ధులతో మాట్లాడుతూ.. అవసరమైన సమయాల్లో పోలీసుల సేవలను వినియోగించుకోవాలని SP సూచించారు.
News January 1, 2026
చిత్తూరు కలెక్టరేట్లో మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లో రవాణా శాఖ జిల్లా అధికారి నిరంజన్ రెడ్డితో కలిసి ‘జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ మాసం ఉత్సవాలు ఈనెల 31వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలను విధిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.


