News December 24, 2024
ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయం: టీటీడీ

AP: దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మిస్తామని TTD EO శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ‘ప్రపంచంలోని పలు దేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం. సీఎం ఆదేశాల మేరకు ఇందుకు ఓ కమిటీ వేస్తున్నాం. నడక దారిలో వచ్చే భక్తుల కోసం ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తాం. TTD సేవలపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 13, 2025
నాలుగు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర: నిఘా వర్గాలు

‘ఢిల్లీ పేలుడు’పై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. 8 మంది ఇద్దరిద్దరుగా విడిపోయి 4 ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారని సమాచారం. ప్రతి గ్రూప్ భారీగా IED తీసుకెళ్లాలని నిర్ణయించారని, పేలుళ్ల కోసం 20 క్వింటాళ్లకు పైగా ఎరువులను సేకరించినట్లు తెలిసింది. మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్కు ముందు ఉమర్కు రూ.20 లక్షల డబ్బు అందిందని నిఘా వర్గాలు గుర్తించాయి.
News November 13, 2025
NIT వరంగల్ 45పోస్టులకు నోటిఫికేషన్

<
News November 13, 2025
విడాకుల తర్వాత భయాందోళనలకు గురయ్యా: సానియా

షోయబ్ మాలిక్తో విడాకుల తర్వాత తాను భయాందోళనలకు గురైనట్లు టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా చెప్పారు. ఆ సమయంలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తనకు అండగా నిలిచారని ఓ టాక్ షోలో తెలిపారు. కఠిన సమయంలో తన ప్రాణ స్నేహితురాలు తోడుగా ఉన్నారన్నారు. మరోవైపు సానియాను ఆ పరిస్థితుల్లో చూసి భయపడ్డానని, ఏమైనా ఆమెకు తోడుగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు ఫరా ఖాన్ పేర్కొన్నారు. మాలిక్తో సానియా 2023లో విడిపోయారు.


