News December 24, 2024

8.3 కోట్ల బిర్యానీలు తినేశారు!

image

స్విగ్గీ 2024కు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. జనవరి 1 నుంచి నవంబర్ 22 వరకు 83 మిలియన్ల ఆర్డర్‌లతో బిర్యానీ అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా నిలిచింది. అందులోనూ హైదరాబాద్‌లో అత్యధికంగా 9.7 మిలియన్లు, బెంగళూరులో 7.7Mn ఆర్డర్స్ వచ్చాయి. ఇక 23Mn ఆర్డర్లతో దోశ రెండో డిష్‌గా నిలిచింది. కాగా అర్ధరాత్రి 12-2 మధ్యలో అధికంగా బిర్యానీలే బుక్ అయ్యాయి. ఇంతకీ మీరేం ఆర్డర్ చేశారు?

Similar News

News September 22, 2025

‘OG’ విలన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

image

పవన్ ‘OG’ మూవీ విలన్ ఇమ్రాన్ హష్మీ (46) ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పారు. ‘వారంలో 5రోజులు జిమ్ చేస్తాను. రోజూ ఓ గంట నడుస్తాను. షుగర్స్ అస్సలు తీసుకోను. లంచ్‌లో కూరగాయలు, పప్పు, రోటీలు తింటాను. నైట్ రోటీలు కూడా తినను. చికెన్ లేదా కూరగాయలు, పప్పు, పెరుగు వంటివి తింటా. ఇప్పుడు రోజులో 16 గం.లు ఫాస్టింగ్ చేస్తున్నా. రోజుకు కనీసం 6 గంటలు నిద్రపోతాను’ అని తెలిపారు.

News September 22, 2025

MP సుధా మూర్తికీ తప్పని సైబర్ వేధింపులు

image

రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి గుర్తుతెలియని వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘SEP 5న నాకో వ్యక్తి ఫోన్ చేసి టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగినని చెప్పాడు. నా ఫోన్ నంబర్ ఆధార్‌కు లింక్ కాలేదని అన్నాడు. నాకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయన్నాడు. నా ఫోన్ కనెక్షన్ కట్ చేస్తున్నట్లు చెప్పాడు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

News September 22, 2025

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు: APSDMA

image

AP: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.