News December 25, 2024

గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక ఆదేశాలు

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రోజూ తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బయోమెట్రిక్ ఆధారిత వేతన బిల్లులనే నమోదు చేయాలని అధికారులకు సూచించింది. అలాగే ఇటీవల విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్-2047 ఫ్రేమ్ వర్క్ బాధ్యతల్లోనూ పాలుపంచుకోవాలని పేర్కొంది. దీనిపై CM ప్రతి శుక్రవారం నిర్వహించే సమీక్షలో RTGSతోపాటు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు కూడా పాల్గొనాలని తెలిపింది.

Similar News

News September 19, 2025

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వివరాలు (2/2)

image

Day 4(sep 27): కల్పవృక్ష వాహనం,సర్వ భూపాల వాహనం
Day 5(sep 28) : మోహినీ అవతారం, గరుడ వాహనం
Day 6(sep 29) : హనుమంత వాహనం, స్వర్ణ రథోత్సవం, గజ వాహనం
Day 7(sep 30) : సూర్య ప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
Day 8(Oct 1) : రథోత్సవం, అశ్వ వాహనం
Day 9(sep 2) : పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, చక్రస్నానం, ధ్వజావరోహణం

News September 19, 2025

సొరకాయలు కోతకు వచ్చినట్లు ఎలా గుర్తించాలి?

image

సొరకాయల పంట నాటిన 55-75 రోజులకు కోతకు వస్తుంది. లేత కాయలను గోటితో నొక్కినప్పుడు తొక్క లోపలికి గోరు సులభంగా పోతుంది. అలాగే లేత కాయల తొక్క మీద నూగు ఉంటుంది. కాయ లోపల గింజలు, గుజ్జు గట్టిపడక ముందే కాయలను కోసి మార్కెట్‌కు తరలించాలి. ముదిరిన కాయల తొక్క గట్టిపడి క్రమంగా తెలుపు రంగులోకి మారుతుంది. కాయలను కోసేటప్పుడు తొడిమలతో సహా కోసి మార్కెట్‌కు తరలించాలి. కోసిన కాయలు 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి.

News September 19, 2025

వరి చిరు పొట్ట దశలో పొటాష్ వేస్తున్నారా?

image

వరిసాగులో ఎరువుల యాజమాన్యం ముఖ్యం. సరైన సమయంలో పంటకు అవసరమైన ఎరువులు, పోషకాలు అందించాలి. తెలుగు రాష్ట్రాలలో తేలిక భూములే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వరి చిరు పొట్ట దశలో ఎకరాకు 35 నుంచి 40 కిలోల యూరియాతో పాటు 20 నుంచి 25 కిలోల పొటాష్ ఎరువును వాడటం మంచిది. ఈ దశలో పొటాష్ వాడకం వల్ల వెన్నులో గింజ నాణ్యంగా ఉండి.. తాలు గింజలు ఏర్పడవు. దీని వల్ల అధిక దిగుబడులకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.