News December 25, 2024

క్రిస్మస్ అటాక్స్: నల్లసముద్రం మీదుగా రక్తం పారించిన రష్యా

image

ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు జరుగుతుంటే ఉక్రెయిన్‌లో మాత్రం రక్తం పారుతోంది. డ్రోన్ దాడులకు రష్యా ప్రతీకారం తీర్చుకుంటోంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా బాలిస్టిక్, క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగిస్తోంది. విద్యుత్, ఇంధన కేంద్రాలను ధ్వంసం చేస్తోంది. ఈ దాడుల్లో కొందరు మరణించినట్టు సమాచారం. బుధవారం ఉదయం నుంచే నల్లసముద్రం మీదుగా శత్రువు మిసైళ్లను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ ఎనర్జీ మినిస్టర్ ధ్రువీకరించారు.

Similar News

News September 23, 2025

స్థానిక సంస్థలు.. బీసీలకు ఎన్ని స్థానాలంటే?

image

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇవి అమలైతే బీసీలకు 13 జడ్పీ, 237 MPP, జడ్పీటీసీ, 2,421 MPTC, 5,359 పంచాయతీ స్థానాలు దక్కనున్నట్లు సమాచారం. దీనిపై జీవో వచ్చాక మరింత క్లారిటీ రానుంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో 2,345 జీపీలు, 90 ZPTC, 95 ఎంపీపీ, 1,011 ఎంపీటీసీ, 6 ZP స్థానాలను బీసీలకు కేటాయించింది.

News September 23, 2025

నేడు శ్రీ గాయత్రీ దేవి అవతారం.. ఏ పూలతో పూజ చేయాలి?

image

దసరా నవరాత్రుల్లో రెండో రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు.. ఈ రూపంలో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి, పంచ ముఖాలు, పది కళ్లతో, భూమి, ఆకాశం, సృష్టిని సూచించే రంగుల కిరీటంతో ముక్తా, హేమ, నీల, విద్రుమ, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంటారు. ఈ రోజున అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పించాలి. పసుపు రంగు పూలతో పూజించాలి. ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదించాలి.

News September 23, 2025

రోజూ గాయత్రీ మంత్రం పఠిస్తే..

image

‘ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి! ధియో యో నః ప్రచోదయాత్!!’ అనే గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదని పురాణాలు చెబుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చొని జపం చేయాలి. ఇలా రోజూ చేస్తే జీవితంలో ఒత్తిడి, ఆందోళన తగ్గి సంతోషం, గెలుపు దక్కుతాయని, దుఃఖం, బాధలు, దారిద్ర్యం, పాపాలన్నీ తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు.