News March 16, 2024

వైసీపీ అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు

image

AP: వైసీపీ ప్రకటించిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు ఉన్నారు. 18 మంది డాక్టర్లు, 15 మంది అడ్వకేట్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు, ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒక జర్నలిస్టు ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 19 మంది మహిళలకు సీఎం జగన్ అవకాశం కల్పించారు.

Similar News

News October 8, 2024

హరియాణా విజయం ప్రజాస్వామ్య విజయం: మోదీ

image

నవరాత్రి సమయంలో హరియాణాలో గెలవడం శుభసూచకమని PM నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో PM మాట్లాడారు. ‘హరియాణా విజయం ప్రజాస్వామ్య విజయం. కార్యకర్తల కృషితోనే ఇది సాధ్యమైంది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు. జమ్మూ కశ్మీర్‌లో గెలిచిన కాంగ్రెస్-ఎన్సీ కూటమికి నా అభినందనలు. JKలో మా ఓటింగ్ శాతం పెరగడంతో గర్వంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

News October 8, 2024

ఫ్రీగా గ్యాస్ సిలిండర్ కావాలంటే..

image

ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీం ద్వారా కేంద్రం మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్, ఒక సిలిండర్ అందిస్తోంది. ఇందుకోసం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి ఫామ్ నింపి, రేషన్, ఆధార్, అడ్రస్, ఫొటోలు సమర్పించాలి. లేదంటే https://pmuy.gov.in/లోకి వెళ్లి Apply for New Ujjwala 2.0 Connectionపై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సదరు మహిళ బీపీఎల్ కుటుంబానికి చెందినవారై ఉండాలి. ఇప్పటికే ఎల్పీజీ కనెక్షన్ ఉండొద్దు.

News October 8, 2024

ISS రష్యన్ సెగ్మెంట్ నుంచి ఎయిర్ లీకేజీ

image

అంతరిక్ష కేంద్రం (ISS)లోని రష్యన్ విభాగంలో గాలి లీక్ అవుతుండ‌డంపై నాసా ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. జ్వెజ్డా మాడ్యూల్ PrK వెస్టిబ్యూల్‌లో 2019లో మొదటిసారిగా లీకేజీని గుర్తించారు. ఏప్రిల్ 2024 నాటికి రోజుకు 1.7 కేజీల గాలి లీకేజీ పెరిగిన‌ట్టు తేలింది. దీని వ‌ల్ల వ్యోమ‌గాముల నివాస అనుకూల పరిస్థితులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే, లీకేజీ నియంత్రణలో కొంత పురోగతి సాధిస్తున్నట్లు నాసా తెలిపింది.