News December 26, 2024
YCPపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది: సజ్జల

AP: సమస్యలపై తక్షణమే స్పందిస్తుండటంతో వైసీపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కష్టకాలంలో వారికి అండగా ఉంటామని నేతలు భరోసా అందించాలని ఆయన చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపింది. దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన చేపట్టాలి. ఈ నెల 27న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలి’ అని ఆయన నేతలకు సూచించారు.
Similar News
News January 30, 2026
అల్లు అర్జున్-లోకేశ్ సినిమాలో శ్రద్ధా కపూర్?

తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించే అవకాశం ఉందని సినీవర్గాలు వెల్లడించాయి. డైరెక్టర్ ఆమెను సంప్రదించి స్టోరీ వినిపించినట్లు పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. కాగా బన్ని ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. అందులో దీపికా పదుకొనె నటిస్తున్నారు.
News January 30, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 30, 2026
మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత

మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు TTD ప్రకటించింది. గ్రహణం మ.3.20 గంటలకు ప్రారంభమై సా.6.47 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6hrs ముందు ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని 9am నుంచి 7.30pm వరకు మూసివేయనున్నారు. 7.30pmకి ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. 8:30pm నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.


