News March 16, 2024
భూ వాతావరణంపై మార్స్ ప్రభావం! – 2/2

ఈ అరుదైన ఘటనతో 24లక్షల ఏళ్లకు ఓసారి భూ వాతావరణంలో భారీ మార్పులు సంభవిస్తాయట. ఓ గ్రాండ్ సైకిల్లో భూమికి ఎక్కువ సూర్యకాంతి తగులుతూ, తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటే మరో సైకిల్లో సూర్యకాంతి తగ్గి, శీతల ఉష్ణోగ్రతలు నమోదవుతాయట. భూ అవక్షేపాలపై పరిశోధనతో ఈ విషయాలను కనుగొన్నారు. సముద్ర గర్భాన మార్పులు, గతకొన్నేళ్లలో పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ తమ పరిశోధనకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.
Similar News
News September 1, 2025
నేడు రాజంపేటలో సీఎం పర్యటన.. పెన్షన్ల పంపిణీ

AP: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ ఉదయం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,746 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. సీఎం చంద్రబాబు ఇవాళ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కె.బోయినపల్లిలో పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం తాళ్లపాక గ్రామంలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.
News September 1, 2025
టారిఫ్స్ లేకపోతే మన దేశం నాశనమయ్యేది: ట్రంప్

ట్రంప్ అధికార పరిధి దాటి టారిఫ్స్ విధిస్తున్నారంటూ <<17559172>>US కోర్టు<<>> ఇటీవల ఆక్షేపించింది. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. ‘టారిఫ్స్ వల్ల $ట్రిలియన్లు వచ్చాయి. అవి లేకుంటే మన దేశం పూర్తిగా నాశనమయ్యేది. మన మిలిటరీ పవర్ పోయేది. ఇది ర్యాడికల్ లెఫ్ట్ గ్రూప్ జడ్జిలకు తెలియదు. కానీ డెమోక్రాట్ ఒబామా నియమించిన ఒక్క జడ్జి మాత్రం దేశాన్ని కాపాడేందుకు ఓట్ వేశారు. అతడి ధైర్యానికి థాంక్స్’ అని వ్యాఖ్యానించారు.
News September 1, 2025
కాళేశ్వరంపై CBI విచారణకు నిర్ణయం.. ఇందుకేనా?

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం CID లేదా సిట్ ద్వారా విచారణ చేపట్టే అవకాశముందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం ఈ కేసును <<17577217>>CBIకి<<>> అప్పగించాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మాజీ సీఎం KCR అరెస్ట్ అయితే కక్షపూరిత చర్యలు తీసుకుందనే అపవాదు రాకుండా జాగ్రత్త పడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని నిర్ణయించిందని చెబుతున్నారు.