News March 16, 2024
పర్వతగిరిలో విషాదం.. విద్యుత్ షాక్తో యువకుడి మృతి

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గుగులోతు తండాలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గుగులోతు వెంకన్న(28) తన ఇంటి ముందు బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్కి గురయ్యాడు. ఈ క్రమంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వెంకన్నకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ వెంకన్న తెలిపారు.
Similar News
News August 23, 2025
వరంగల్ డీఈవో జ్ఞానేశ్వర్కు స్థానచలనం

వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న వరంగల్ డీఈవో మామిడి జ్ఞానేశ్వర్ను నిర్మల్ జిల్లా FAC FAOగా పంపిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ డా.నవీన్ నికోలస్ శఉక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జ్ఞానేశ్వర్పై వివిధ ఉపాధ్యాయ సంఘాలు 21 ఆధారాలతో కూడిన ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ డైరెక్టర్ వేటు వేసినట్లు తెలుస్తోంది.
News August 22, 2025
వరంగల్: మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలోని 10 జూనియర్ కళాశాలల మౌలిక వసతుల పనులను దసరా లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. ‘అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి’పై సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.1.36 కోట్లు కేటాయించిందని తెలిపారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని ప్రిన్సిపాల్స్, కమిటీ ఛైర్మన్లను ఆదేశించారు.
News August 22, 2025
రేపటి నుంచి ప్రభుత్వ జూ.కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు

ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూ.కళాశాలల్లో ఈనెల 23 నుంచి ముఖ గుర్తింపు హాజరు(ఫేస్ రికగ్నెషన్ సిస్టమ్) హజరు పద్దతి అమలు చేయనున్నట్లు DIEO డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఈరోజు ఇంటర్ విద్య కార్యాలయంలో ప్రిన్సిపళ్లకు, సంబంధిత ఇన్ఛార్జ్లకు నూతన హాజరు విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీజీబీఐఈ-ఎఫ్ ఆర్ఎస్ యాప్ ఇన్స్టాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని రోజువారీ హాజరు నమోదు చేయాలన్నారు.