News December 26, 2024
HYD: 2030 నాటికి 20 వేల మెగావాట్ల ఇంధన ఉత్పత్తి: భట్టి

2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించిందన్నారు.
Similar News
News November 8, 2025
హైదరాబాద్ మాజీ క్రికెటర్కు అరుదైన గౌవరం

మిథాలి రాజ్.. హైదరాబాదీ మాజీ క్రికెటర్.. మహిళా క్రికెట్లో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన గొప్ప క్రీడాకారిణి. వివిధ మ్యాచ్లో గెలిపించి భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న బ్యాట్స్ ఉమెన్.. ఇప్పడు మిథాలికి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీలో జరిగిన సమావేశంలో మిథాలికి ఐసీసీ ఉమెన్ క్రికెట్ కమిటీలో చోటు కల్పించింది. దీంతో హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 8, 2025
జూబ్లీ బైపోల్: చనిపోయిన ఓటర్ల వివరాల సేకరణ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈసారి వివిధ పార్టీల కార్యకర్తలు మరణించిన ఓటర్ల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎంతమంది మరణించారు.. ఎంతమందికి ఇక్కడ ఓట్లు ఉన్నాయి అనే విషయాలు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ రోజు ఎవరైనా మృతి చెందిన ఓటరు పేరున వచ్చి ఓటు వేసే ప్రమాదముండటంతో ముందుజాగ్రత్త చర్యగా.. పోలింగ్ కేంద్రంలో అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
News November 8, 2025
సికింద్రాబాద్: బెర్తులు ఖాళీ.. బుక్ చేసుకోండి!

సిటీ నుంచి వెళ్లే పలు రైళ్లకు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.. బుక్ చేసుకోండి అంటూ స్వయంగా రైల్వే అధికారులే చెబుతున్నారు. సికింద్రాబాద్ నుంచి అనకాపల్లి, చర్లపల్లి నుంచి దానాపూర్, విశాఖపట్టణం, కాకినాడ, ధర్మవరం, తిరుచానూరు, నర్సాపూర్, కాచిగూడ నుంచి తిరుచానూరుకు వెళ్లే రైళ్లల్లో బెర్తులు నేటి నుంచి 13 వరకు ఖాళీలున్నాయని CPRO శ్రీధర్ తెలిపారు. మరెందుకాలస్యం.. ప్రయాణాలుంటే బుక్ చేసుకోండి మరి.


