News March 16, 2024
పార్లమెంట్ టు అసెంబ్లీ.. అసెంబ్లీ టు పార్లమెంట్

AP: 2014లో MLAలుగా గెలిచిన వారు ఎంపీలుగా, MPలు ఎమ్మెల్యేలుగా ఈసారి YCP నుంచి పోటీ చేయనున్నారు. పొన్నూరు MLA కిలారు రోశయ్య- గుంటూరు MP, చంద్రగిరి MLA చెవిరెడ్డి భాస్కర్రెడ్డి- ఒంగోలు MP, రాజోలు MLA వరప్రసాద్- అమలాపురం MP, నెల్లూరు సిటీ MLA అనిల్ కుమార్- నరసరావుపేట MP, రాజమండ్రి MP భరత్- రాజమండ్రి సిటీ MLA, కాకినాడ MP వంగా గీత- పిఠాపురం MLA, నెల్లూరు MP ప్రభాకర్రెడ్డి- నెల్లూరు రూరల్ MLA.
Similar News
News August 19, 2025
‘వార్-2’కు రూ.300 కోట్ల కలెక్షన్స్

‘వార్-2’ సినిమా ఇప్పటివరకు రూ.300.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. ఇండియాలో రూ.240 కోట్లు, ఓవర్సీస్లో రూ.60.50 కోట్లు వచ్చినట్లు తెలిపింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, Jr.NTR ప్రధాన పాత్రల్లో నటించారు. YRF స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన ఈ మూవీ అగస్టు 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
News August 19, 2025
ఐదుగురు మృతి.. నివేదిక కోరిన HRC

HYD రామంతాపూర్లో విద్యుత్ షాక్తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన <<17438408>>ఘటనను <<>>రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఘటనకు కారణాలు, బాధిత కుటుంబాలకు పరిహారంతో పాటు భద్రతా చర్యలపై విద్యుత్ శాఖను నివేదిక కోరింది. సెప్టెంబర్ 22లోపు ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని TGSPDCL CMDకి గడువు విధించింది.
News August 19, 2025
ఇందిరమ్మ ఇళ్ల ‘గృహప్రవేశానికి’ సీఎం!

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. ఇప్పటివరకు 4వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో స్థానిక ఎన్నికలకు ముందే గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. ఆయా కార్యక్రమాల్లో సీఎంతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. ఈనెల 21న CM రేవంత్ రెడ్డి అశ్వారావుపేటలో జరగనున్న గృహప్రవేశ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.