News March 16, 2024

త్యాగమూర్తి పొట్టిశ్రీరాములు జయంతి నేడు

image

స్వభాషారాష్ట్రం కోసం ఆత్మార్పణకు పూనుకొన్న యోధుడు పొట్టి శ్రీరాములు. ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం 1952 OCT 10 నుంచి 58 రోజుల పాటు ఆయన మద్రాస్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అసువులు బాసి అమరజీవి అయ్యారు. ఆయన ధీరోదాత్త ఆత్మత్యాగ ఫలితమే ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర అవతరణ. 1953 OCT 1న కర్నూలు జిల్లా రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 2008లో నెల్లూరు జిల్లా పేరును శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.

Similar News

News October 20, 2025

వీటిని పాటిస్తే అంతా ఆరోగ్యమే: వైద్యులు

image

శరీర భాగాల ఆరోగ్యం కోసం రోజూ చేయాల్సిన పనులను వైద్యులు సూచిస్తున్నారు. ‘మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఉదయాన్నే నీరు తాగండి. మెదడు & హార్మోన్ల కోసం రోజూ కోడిగుడ్లు తినండి. నడక & వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉదయం అల్లం నీరు తాగితే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. సూర్యకాంతి వల్ల చర్మం ప్రకాశిస్తుంది. నిద్రకు ముందు పచ్చి వెల్లుల్లి తింటే టెస్టోస్టిరాన్ పెరుగుతుంది’ అని సూచిస్తున్నారు. Share it

News October 20, 2025

బత్తాయిలో తొడిమ కుళ్లు తెగులును ఎలా నివారించాలి?

image

తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1 గ్రాము కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం తొలకరిలో చెట్లలో ఎండుపుల్లలను కత్తిరించి నాశనం చేయాలి. శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబించాలి. తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

News October 20, 2025

ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం: డీజీపీ

image

TG: నిజామాబాద్‌లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి డీజీపీ శివధర్ రూ.కోటి పరిహారం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. పదవీ విరమణ వరకు వచ్చే శాలరీ అందిస్తామని, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారాన్ని రేపు అమరవీరుల సభలో సీఎం ప్రకటిస్తారని వెల్లడించారు.