News March 16, 2024
ఆర్మూర్: మూడు ఇళ్లలో చోరీ

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 21, 22 వార్డులలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నయీముద్దీన్ ఇంట్లో నుంచి దాదాపు రూ.2 లక్షల నగదు, 10 తులాల బంగారం ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయారు. షబానా బేగం ఇంట్లో నుంచి రూ.80వేలు, తులం బంగారం ఎత్తుకెళ్లారు. గంగుబాయి ఇంటి తాళం పగలగొట్టి చోరీకి యత్నించగా అలికిడి రావడంతో దుండగులు పరారయ్యారని బాధితులు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 30, 2026
NZB: కార్పొరేషన్ ‘హస్త’గతం కోసం యత్నాలు

గత కార్పొరేషన్ ఎన్నికల్లో 2 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠం హస్తగతం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే సర్వేలు పూర్తి చేసింది. అవసరమైతే AIMIM పొత్తు పెట్టుకుని తమ అభ్యర్థిని మేయర్ చేయాలని ఎత్తుగడలు వేస్తున్నారు.
News January 30, 2026
NZB: మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలి: కలెక్టర్

ప్రైవేటు, కార్పొరేటు హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేయాలని NZB జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం నిర్వహించిన వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరుపేదలకు సేవలందించే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. DMHO రాజశ్రీ పాల్గొన్నారు.
News January 30, 2026
NZB: మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలి: కలెక్టర్

ప్రైవేటు, కార్పొరేటు హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేయాలని NZB జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం నిర్వహించిన వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరుపేదలకు సేవలందించే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. DMHO రాజశ్రీ పాల్గొన్నారు.


