News December 26, 2024

ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

SBI 600 పీఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి అప్లికేషన్ విండో ఓపెన్ కానుంది. ఇది 16 జనవరి 2025 వరకు కొనసాగుతుంది. ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.750 కాగా మిగతావారికి ఉచితం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది మార్చి 8-15 వరకు జరగనుంది. మెయిన్స్ ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: <>sbi.co.in<<>>

Similar News

News November 6, 2025

నియోనాటల్‌ పీరియడ్‌ కీలకం

image

బిడ్డ పుట్టిన మొదటి 28 రోజులు చాలా క్లిష్టమైన సమయం. దీన్ని నియోనాటల్‌ పీరియడ్‌ అంటారు. ఈ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా శిశువు ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు. నియోనాటల్‌ పీరియడ్‌‌లో బిడ్డకు అనారోగ్యాల ముప్పు తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహించడానికి స్పెషల్‌ కేర్‌ అవసరం. బిడ్డను వెచ్చగా ఉంచడం, శ్వాసక్రియ సరిగా ఉండేలా చూడటం, తల్లిపాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటం ముఖ్యమని చెబుతున్నారు.

News November 6, 2025

కష్టాల్లో ఆస్ట్రేలియా

image

భారత్‌తో నాలుగో టీ20లో 168 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మార్ష్ 30, షార్ట్ 25, ఇంగ్లిస్ 12, డేవిడ్ 14, ఫిలిప్పీ 10 రన్స్‌కే ఔట్ అయ్యారు. భారత బౌలర్లు అక్షర్, దూబే చెరో 2 వికెట్లతో అదరగొట్టారు. అర్ష్‌దీప్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం ఆసీస్ విజయానికి 36 బంతుల్లో 69 రన్స్ అవసరం.

News November 6, 2025

SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కేరళ

image

EC చేపట్టిన SIRపై TN బాటలోనే కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా SCని ఆశ్రయించనుంది. అఖిలపక్ష సమావేశంలో CM పినరయి విజయన్ దీన్ని వెల్లడించారు. BJP మినహా ఇతర పక్షాలన్నీ దీన్ని ఆమోదించాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితా రెడీగా ఉన్నా EC 2002 నాటి జాబితా ప్రకారం SIR నిర్వహించబోవడాన్ని తప్పుబట్టాయి. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయని పేర్కొన్నాయి. EC ఇలా చేయడం వెనుక రహస్యాలున్నట్లేనని ధ్వజమెత్తాయి.