News March 16, 2024

HYD: స్థలం ఖాళీగా ఉందని కబ్జా చేశారు..!

image

రూ.30 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉందని పక్కనే ఉన్న యజమాని తన స్థలంతో పాటు కలిపేసుకుని గదులు క్రీడా మైదానం ఏర్పాటు చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ ఫేజ్‌-1లో చోటుచేసుకుంది. పలువురు ఫిర్యాదుల మేరకు షేక్‌పేట రెవెన్యూ అధికారులు పరిశీలించేందుకు వెళ్తే వారెంట్‌ లేకుండా అనుమతి లేదని అధికారులతో వాదించారు. 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించామన్నారు.

Similar News

News January 26, 2026

గోల్కొండ, చార్మినార్ కట్టడాలకు TOP 10లో చోటు

image

గోల్కొండ, చార్మినార్ కట్టడాలు భాగ్యనగర పేరును ప్రపంచవ్యాప్తం చేశాయి. వాటి అందాలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి వేలాది మంది వస్తుంటారు. దేశంలోని చారిత్రక ప్రాంతాలను చూసేందుకు వచ్చేవారు ఈ రెండింటిని చూడకుండా వెళ్లరు. అందుకే టాప్ 10 ప్రదేశాల్లో గోల్కొండ, చార్మినార్ చోటు సంపాదించుకున్నాయి. గోల్కొండ కోట 6వ స్థానం, చార్మినార్ 10వ స్థానంలో ఉన్నాయి.

News January 26, 2026

నాంపల్లి: రోజుకు 44వేల మంది సందడి చేస్తున్నారు

image

నుమాయిష్.. నగరవాసులు సరదాగా గడిపే ప్రాంతం. ఏటా JAN, FEB నెలల్లో నాంపల్లిలో నిర్వహించే ఎగ్జిబిషన్‌ను ఈ సంవత్సరం లక్షల మంది సందర్శిస్తున్నారు. ఈనెల 1 నుంచి ఇప్పటివరకు (25వ తేదీ వరకు) 11లక్షల మంది నుమాయిష్‌లో సందడి చేశారు. అంటే రోజుకు సరాసరి 44వేల మంది వస్తున్నట్లు. FEB 15 వరకు నగరవాసులకు ఈ వినోదం అందుబుటోల ఉంటుంది. ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు.

News January 26, 2026

హైదరాబాద్: 24 ఏళ్ల తర్వాత చారిత్రక దృశ్యం

image

హైదరాబాద్ చారిత్రక కోత్వాల్ హౌస్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కాగా, 2002 తర్వాత తొలిసారిగా నగర పోలీస్ కమిషనర్ కోత్వాల్ హౌస్‌లో జాతీయ జెండాను ఎగురవేయడం విశేషం. ఈ కార్యక్రమం నగరానికి గర్వకారణంగా నిలుస్తోంది.