News December 27, 2024

YS జగన్ వల్లే విద్యుత్ ఛార్జీల పెంపు: అచ్చెన్నాయుడు

image

AP: వైసీపీ పాలనలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు ఛార్జీల పెరుగుదలకు జగనే కారణమని ఆరోపించారు. యూనిట్ విద్యుత్ రూ.5కే వస్తున్నా జగన్ రూ.8కి కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. ఆయన చేసిన పాపాలు నేడు శాపాలుగా మారాయని మండిపడ్డారు. ప్రజలపై భారం మోపి ఇప్పుడు ధర్నాలు, ర్యాలీలు చేయడం సిగ్గుచేటన్నారు.

Similar News

News October 18, 2025

150 లిక్కర్ షాపులకు ఏపీ మహిళ దరఖాస్తు

image

TG: మద్యం షాపుల దరఖాస్తులు నేటితో ముగిశాయి. మొత్తం 90వేలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళ 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసింది. ఆమె ఏపీకి సరిహద్దు జిల్లాల్లోని షాపులకు ఎక్కువగా దరఖాస్తులు చేసిందని అధికారులు చెబుతున్నారు. యూపీ, కర్ణాటక, ఒడిశా నుంచి కూడా చాలా మంది మహిళలు అప్లై చేసుకున్నారు. ఈనెల 23న లైసెన్స్‌ల కోసం డ్రా నిర్వహించనున్నారు.

News October 18, 2025

USలో యాక్సిడెంట్.. తెలంగాణకు చెందిన తల్లి, కూతురు మృతి

image

TG: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన రమాదేవి(52), తేజస్వి(32) మృతిచెందారు. విఘ్నేష్, రమాదేవి దంపతుల కూతుళ్లు స్రవంతి, తేజస్వి తమ భర్తలు, పిల్లలతో కలిసి USలో ఉంటున్నారు. తేజస్వి ఫ్యామిలీ USలో నూతన గృహ ప్రవేశం చేయగా, కుటుంబ సభ్యులంతా వెళ్లారు. ఆ తర్వాత అందరూ కలిసి స్రవంతి ఇంటికి కారులో వెళ్తుండగా ట్రక్కు ఢీకొట్టింది. రమాదేవి, తేజస్వి ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.

News October 18, 2025

CPS అంశాన్ని త్వరలో పరిష్కరిస్తాం: సీఎం

image

AP: *ఈ దీపావళి లోపు RTC ఉద్యోగుల ప్రమోషన్లు క్లియర్ చేస్తాం
*180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు
*పోలీసులకు EL’s కింద NOVలో రూ.105 కోట్లు, జనవరిలో రూ.105 కోట్లు ఇస్తాం
*నాలుగో తరగతి ఉద్యోగుల గౌరవాన్ని పెంచేలా రీ డెసిగ్నేట్
*CPS అంశంపై చర్చించి త్వరలో పరిష్కరిస్తాం
*ఉద్యోగ సంఘాల భవనాల ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తాం