News March 16, 2024
కుప్పంలో చంద్రబాబుపై భరత్ గెలుస్తాడా…?

వైసీపీ కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్జె.కె.భరత్ను అధికారికంగా శనివారం నియమించారు. 2019 ఎన్నికల్లో ఆయన తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయారు. ఆయన మరణాంతరం కుమారుడు భరత్కు సీఎం జగన్ నియోజకవర్గ బాధ్యతలు ఎమ్మెల్సీ పదవీ కట్టబెట్టారు. 2024 ఎన్నికల్లో భరత్ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొననున్నారు.
Similar News
News April 11, 2025
ఫూలే జయంతి వేడుకలను జయప్రదం చేయండి: కలెక్టర్

ప్రభుత్వం ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ భవన్లో ఉదయం 10.30గంటలకు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని జయప్రదం చేయాలని కోరారు.
News April 10, 2025
15న చిత్తూరు ఐటీఐలో అప్రెంటిస్ మేళా

చిత్తూరు ఐటీఐలో ఈనెల 15న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ప్రముఖ కంపెనీలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు మేళా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో చదివిన విద్యార్థులు అర్హులని చెప్పారు. ఐబీఎం ఓచర్లో నమోదు చేసుకోవాలన్నారు.
News April 10, 2025
చిత్తూరు: ముగిసిన టెన్త్ వ్యాల్యుయేషన్

చిత్తూరు పీసీఆర్ పాఠశాలలో ఏడు రోజులుగా సాగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,74,808 పదో తరగతి పరీక్షల జవాబుపత్రాలను ఈనెల 9వ తేదీ వరకు దిద్దామన్నారు.