News March 16, 2024

కుప్పంలో చంద్రబాబుపై భరత్ గెలుస్తాడా…?

image

వైసీపీ కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్‌జె.కె.భరత్‌ను అధికారికంగా శనివారం నియమించారు. 2019 ఎన్నికల్లో ఆయన తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయారు. ఆయన మరణాంతరం కుమారుడు భరత్‌కు సీఎం జగన్ నియోజకవర్గ బాధ్యతలు ఎమ్మెల్సీ పదవీ కట్టబెట్టారు. 2024 ఎన్నికల్లో భరత్ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొననున్నారు.

Similar News

News February 5, 2026

చిత్తూరు: నేడు రానున్న 400 టన్నుల యూరియా

image

జిల్లాలో 2,442 టన్నుల యూరియా నిల్వలున్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి తెలిపారు. రైతు సేవా కేంద్రాల పరిధిలోనే ఈ యూరియాను అధికంగా ఉంచామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. నేడు(గురువారం) మరో 400 టన్నుల యూరియా రానుందన్నారు. ఆ యూరియాను కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందేలా చూస్తామన్నారు.

News February 5, 2026

చిత్తూరు: నలుగురు అరెస్ట్

image

చిత్తూరులో పేకాట ఆడుతున్న నలుగురిని బుధవారం రాత్రి 2- టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. యాదమరి జంక్షన్ వద్ద జూదం ఆడుతున్నారని తెలుసుకున్న 2-టౌన్ ఇన్‌స్పెక్టర్ నెట్టికంటయ్య పోలీసు బృందంతో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.4వేల నగదు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

News February 4, 2026

చిత్తూరు: పోస్టాఫీసులో ఉద్యోగాలు.. APPLY చేసుకోండి.!

image

చిత్తూరు డివిజనల్ పోస్టాఫీస్ పరిధిలో 23 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఏబీపీఎం, బీపీఎం, డాక్ సేవక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. https://www.indiapost.gov.in/ లో ఈనెల 16 లోపు దరఖాస్తు చేయాలన్నారు. 18 నుంచి 40 సంవత్సరాలలోపు, పదో తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందన్నారు.