News December 27, 2024
సంగారెడ్డి: మైనర్ బాలికపై అత్యాచారం.. 20ఏళ్లు జైలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రజినీకాంత్కు 20 ఏళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి జయంతి తీర్పు వెల్లడించారని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. 2019లో చౌటకూరు మండలం ఉప్పరగూడెంకు చెందిన రజనీకాంత్ ఇంటికి వెళ్లి అత్యాచారం చేశాడని బాలిక తండ్రి పుల్కల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు.
Similar News
News January 22, 2026
గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు పొడగింపు

తెలంగాణ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఈనెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా కోఆర్డినేటర్ ఆఫీసర్ అనురాధ తెలిపారు. ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఈనెల 21 వరకు గడువు ఉండగా 25 వరకు పొడిగించినట్లు తెలిపారు. 2026- 27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి, 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి పరీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు. అవకాశం వినియోగించుకోవాలని ఆమె కోరారు
News January 22, 2026
రామాయంపేట: అధికార కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ బెడద..!

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రామాయంపేట కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ బెడద నెలకొంది. మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు ఉండగా ఒక్కో వార్డులో ముగ్గురు నలుగురు చొప్పున టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే టిక్కెట్టు రానివారు రిబ్బన్స్ గా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధినాయకులు మాత్రం రెబెల్స్ ను ప్రోత్సహించే నాయకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
News January 22, 2026
మెదక్: ఒంటరిగా జీవించలేక యువకుడి సూసైడ్

భార్యతో విడిపోయి ఒంటరిగా జీవించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన టేక్మాల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంపూలూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ కొన్ని రోజుల క్రితం భార్యతో గొడవతో పెద్దల సమక్షంలో విడిపోయాడు. అప్పటి నుంచి మనస్తాపంతో తాగుడుకు బానిసైన ప్రశాంత్.. సోమవారం గ్రామ శివారులో పురుగు మందు తాగాడు. గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.


