News December 27, 2024

కరీంనగర్ బస్టాండ్‌కు 44 ఏళ్లు పూర్తి

image

కరీంనగర్ బస్టాండ్ ఏర్పాటు చేసి నేటితో 44 ఏళ్లు పూర్తిచేసుకుంది. తెలంగాణలో HYD MG బస్టాండ్ తర్వాత అతిపెద్ద బస్టాండ్ KNR బస్టాండ్‌ కావడం విశేషం. 11 నవంబరు, 1976లో అప్పటి సీఎం జలగం వెంగళరావు KNR బస్టాండ్‌కు శంకుస్థాపన చేశారు. డిసెంబరు 27, 1980న అప్పటి భారత విదేశాంగ శాఖామంత్రి పీవీ నరసింహరావు ప్రారంభించారు. ఈ బస్టాండ్ పూర్తిచేయడానికి 4 ఏళ్లు పట్టింది. మొత్తం 44 ప్లాట్ ఫాంలు ఉన్నాయి.

Similar News

News November 1, 2025

కరీంనగర్ సీపీఓగా పూర్ణచంద్రారావు అదనపు బాధ్యతలు

image

కరీంనగర్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (Chief Planning Officer – CPO)గా పనిచేసిన ఆర్. రాజారాం ఉద్యోగ విరమణ చేయడంతో, ఆ స్థానంలో మంచిర్యాల సీపీఓగా ఉన్న వి. పూర్ణచంద్రారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్థిక, గణాంకాల శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వి. పూర్ణచంద్రారావు శుక్రవారం కరీంనగర్ సీపీఓగా బాధ్యతలు స్వీకరించారు.

News November 1, 2025

నూతన ట్రాఫిక్ స్టేషన్ కార్యాలయాలను ప్రారంభించిన సీపీ

image

KNR ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనంలో నూతనంగా తీర్చిదిద్దిన ACP, CI, సిటీ రైటర్ కార్యాలయాలను CP గౌస్ అలాం శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ DCP వెంకటరమణ, ACPలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరి స్వామి, వేణుగోపాల్, శ్రీనివాస్ జి, CIలు కరిముల్లా ఖాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత మెరుగుపరచడానికి ఈ నూతన కార్యాలయాలు దోహదపడతాయని CP పేర్కొన్నారు.

News October 31, 2025

KNR: మైనారిటీ గురుకులాల్లో లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు

image

జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కరీంనగర్, మానకొండూర్, జమ్మికుంట గురుకులాల్లోని ఈ పోస్టులకు PG, B.Ed అర్హత ఉన్నవారు నవంబర్ 6వ తేదీ లోగా కరీంనగర్ జిల్లా మైనారిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.