News December 27, 2024

వాల్తేరు డీఆర్ఎంగా లలిత్ బోహ్రా

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు పరిధిలో వాల్తేరు డివిజన్ డీఆర్ఎంగా లలిత్ బోహ్రాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఆయన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. వాల్తేరు డీఆర్ఎంగా పనిచేసిన సౌరబ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుపడ్డారు. అప్పటినుంచి ఏడీఆర్ఎం ఇన్‌ఛార్జ్ డీఆర్ఎంగా పనిచేస్తున్నారు.

Similar News

News January 2, 2026

విశాఖలో రెండు రోజుల పాటు తెలంగాణ గవర్నర్ పర్యటన

image

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రెండు రోజుల విశాఖలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్‌కు వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం తూర్పు నావికా దళం (ENC) ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం రాత్రి 8.35 గంటలకు ఇండిగో విమానంలో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

News January 2, 2026

నేడు GVMC స్థాయీ సంఘం సమావేశం

image

GVMC స్థాయీ సంఘం సమావేశం నేడు జరగనుంది. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ఉదయం GVMC ప్రధాన కార్యాలయంలో సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి 87 అంశాలతో అజెండాను అధికారులు రూపొందించారు. IPRతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. గత సమావేశంలో వివాదాస్పదంగా మారిన మొబైల్ టాయిలెట్ల బిల్లుల చెల్లింపు అంశం ఈసారి మళ్లీ అజెండాలో ఉండటంతో దానికి ఆమోదం లభిస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

News January 2, 2026

మరో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న విశాఖ

image

విశాఖలో ఈనెల 28న మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు మధురవాడలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. భారత్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా విశాఖకు టీ20 మ్యాచ్ రావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.