News December 27, 2024

శ్రీకాకుళం: ‘మన్మోహన్ సింగ్‌‌తో అనుబంధం మరువలేనిది’

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గరువారం రాత్రి మన్మోహన్ సింగ్‌ మరణించడంతో ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను అచ్చెన్న సోషల్ మీడియాలో పంచుకున్నారు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఆయనతో అనుబంధం మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి అచ్చెన్న ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Similar News

News January 19, 2026

అరగంటలోనే సూర్య భగవానుడి దర్శనం: SKLM కలెక్టర్

image

రథసప్తమి పర్వదినాన అరసవల్లికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గతంలో 45 నిమిషాలు పట్టే దర్శన సమయాన్ని ఈసారి 30 నిమిషాలకే తగ్గించేలా 6 ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు. ఉచితంతోపాటు రూ.100, రూ.300,రూ.500 టికెట్లు కూడా ఆన్లైన్, ఆఫ్లైన్లో అందుబాటులో ఉన్నాయన్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు రావచ్చన్నారు.

News January 19, 2026

ఉచిత పశువైద్య శిబిరాల పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి అచ్చెన్న

image

ఏపీలో ఉచిత పశు వైద్య శిబిరాలు తేదీల షెడ్యూల్ పోస్టర్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం తాడేపల్లిలోని కార్యాలయంలో ఆవిష్కరించారు. రైతులు శ్రేయస్సుకు కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగానే పాడి పశువులను పోషించేందుకు ప్రోత్సహిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పాడి సంపద అభివృద్ధి చేయాలని తెలియజేశారు.

News January 19, 2026

మెళియాపుట్టి: ‘వినోదం కోసం వెళ్తే విషాదం ఆవరించింది’

image

వినోదం కోసం పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఆడలి వ్యూ పాయింట్‌కు వెళ్లిన కుటుంబంలో విషాదం నింపింది. నిన్న సాయంత్రం ఏజెన్సీలో ప్రకృతి అందాలను చూసి తిరిగి ఆటోలో వస్తుండగా..వారి వాహనం ఆడలి వ్యూ పాయింట్ వద్ద రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంద్రరావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు మెళియాపుట్టి మండలానికి చెందిన వారిగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.