News March 16, 2024
ఎన్నికలు.. రాష్ట్రాలకు EC ఆదేశాలు

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాలకు EC కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘పక్షపాతం లేకుండా అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలి. పోలింగ్ సిబ్బందిని ర్యాండమ్గా ఎంపిక చేయాలి. నిబంధనలకు అనుగుణంగా పార్టీల ప్రచారాలకు అనుమతి ఇవ్వాలి. పోలింగ్ విధుల్లో వాలంటీర్లు, ఒప్పంద సిబ్బందికి అవకాశం ఇవ్వొద్దు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటును వినియోగించుకునేలా చూడాలి’ అని సూచించింది.
Similar News
News September 4, 2025
GREAT.. 10th చదివి ఆర్థిక క్రమశిక్షణతో రూ.కోటి పొదుపు!

ఆర్థిక క్రమశిక్షణతో ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన ఓ వ్యక్తి కథ నెటిజన్లను మెప్పిస్తోంది. తాను పదో తరగతి మాత్రమే చదివి 25 ఏళ్లలో రూ.కోటి పొదుపు చేసినట్లు 53 ఏళ్ల వ్యక్తి రెడిట్లో పోస్ట్ చేయగా వైరలవుతోంది. తాను నెలకు రూ.4,200 జీతంతో జీవితాన్ని ప్రారంభించానని, ఎప్పుడూ అప్పు చేయలేదని, క్రెడిట్ కార్డు వాడలేదని తెలిపారు. చాలావరకూ నడుస్తూనే వెళ్తానని, ఈ మధ్యే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నానన్నారు.
News September 4, 2025
సెప్టెంబర్ 4: చరిత్రలో ఈ రోజు

1825: జాతీయ నేత దాదాభాయి నౌరోజీ జననం(ఫొటోలో)
1924: కేంద్ర మాజీ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి జననం
1926: శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత బాలు శంకరన్ జననం(ఫొటోలో, కుడివైపు)
1962: భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే జననం
1980: తెలుగు సింగర్, డాన్సర్ స్మిత జననం
1983: పాత తరం తెలుగు సినీ నటి ఛాయాదేవి మరణం
2007: తెలుగు, తమిళ, హిందీ నటి వై.రుక్మిణి మరణం
* జాతీయ వన్యప్రాణుల దినోత్సవం
News September 4, 2025
గోదావరి ఉద్ధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

TG: భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. నిన్న ఉదయం 10 గంటలకు 39 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం రాత్రి 10 గంటల సమయానికి 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.