News December 27, 2024

ఇవాళ కాలేజీలకు సెలవు

image

TG: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా రాష్ట్రంలోని కాలేజీలకు కూడా సెలవు ఇచ్చారు. ఈమేరకు JNTU, కాకతీయ, ఓయూ తదితర యూనివర్సిటీలు ప్రకటన చేశాయి. ఆయా వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ఇవాళ జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటికే స్కూళ్లకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అటు ఏపీలో ఎలాంటి సెలవు ప్రకటించలేదు.

Similar News

News September 23, 2025

PCB అనలిస్ట్ నియామక ఫలితాలు విడుదల

image

AP: పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో గ్రేడ్-2 అనలిస్ట్ పరీక్ష ఫలితాలను <>APPSC<<>> విడుదల చేసింది. పోస్టులకు ఎంపికైన వారి ప్రొవిజినల్ జాబితాను వెబ్సైట్లో పొందుపర్చినట్లు తెలిపింది. కాగా ఎంపికైన వారందరూ ఉద్యోగం సాధించినట్లు కాదని, అభ్యర్థుల క్యారెక్టర్, పూర్వాపరాలపై అపాయింటింగ్ అథారిటీ విచారించి నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. హైకోర్టులో దీనిపై కేసు ఉన్నందున తుది తీర్పు ప్రకారం నియామకాలుంటాయంది.

News September 23, 2025

10 గ్రా. బంగారం ధర రూ.2లక్షలు?.. ‘జెఫరీస్’ అంచనా

image

ప్రపంచ ఆర్థిక అనిశ్చితులతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారని, దీంతో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రఖ్యాత స్టాక్ బ్రోకరేజ్ సంస్థ ‘జెఫరీస్’ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న ధరల నుంచి ఏకంగా 77% మేర పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇదే నిజమైతే 10గ్రా బంగారం ధర ₹2 లక్షల మార్కును చేరుకోనుంది. అయితే ఎప్పటివరకు గోల్డ్ ఆ మార్క్ అందుకుంటుందో చెప్పలేదు.

News September 23, 2025

పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్

image

AP: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని, ఫీవర్‌తోనే నిన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని తెలిపాయి. నిన్న రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగిందని, వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నాయి. విశ్రాంతి అవసరమని సూచించారని వివరించాయి.